Narendra Modi : ఓవైపు గుజరాత్ లో ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. అది కూడా అతి త్వరలోనే. మరో మూడు నెలలు అంతే. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికలను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి కదా. బీజేపీ అంటే ఎలాగూ గుజరాత్ ఎన్నికలను సీరియస్ గానే తీసుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇటీవలే భారత్ జోడో యాత్ర అని రాహుల్ గాంధీ స్టార్ట్ చేశారు కదా. ఈ యాత్ర దాదాపు 150 రోజుల పాటు సాగనుంది. కానీ.. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గుజరాత్ రాష్ట్రాన్ని సందర్శించడం లేదు. ఓవైపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యాత్ర ఎందుకు లేదు.
గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటిస్తారట. అప్పుడు జోడో యాత్ర గుజరాత్ లో కొనసాగనుంది. అయితే.. కేవలం ఎన్నికల ప్రచారం కోసం గుజరాత్ కు రాహుల్ గాంధీ ఒకటి రెండు రోజులు గుజరాత్ లో పర్యటించే అవకాశం ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది. అయినప్పటికీ ఎన్నికల ముందు గుజరాత్ లో జోడో యాత్రను ఎందుకు చేయడం లేదు అనే వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ఈసారి గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన సత్తా చాటబోతోంది. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. ఈనేపథ్యంలో ఇప్పటికే అరవింద్ కేజ్రివాల్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఎన్నికల హామీలు ఇస్తున్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది.
గుజరాత్ కాంగ్రెస్ నాయకులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ల జాడే లేదు. ఎందుకు కాంగ్రెస్.. గుజరాత్ ను వదిలేసినట్టు అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. రాహుల్ గాంధీ చేసే యాత్రే ప్రజలతో మమేకం కావాలని. అటువంటి యాత్రలు అవసరమే కానీ.. సరిగ్గా ఎన్నికల టైమ్ కు ఎందుకు రాహుల్ గాంధీ గుజరాత్ ను ఎందుకు వదిలేసినట్టు. అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఎందుకు లైట్ తీసుకున్నారు అనేది అంతుపట్టడం లేదు. అయితే.. ఇప్పటికే రాహుల్ గాంధీ గుజరాత్ లో మూడు సార్లు పర్యటించారు. కానీ.. అవి ఎన్నికల ప్రచారంలో భాగం కాదు. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గితే ఆ పార్టీ ఓట్లు ఆమ్ ఆద్మీకి పడే అవకాశం ఉంది. అప్పుడు ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య ఉండే అవకాశం ఉంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.