Categories: NationalNewspolitics

షాకింగ్ : నందిగ్రామ్ లో మమత ఓటమి.. ముందు గెలిచిందని.. తర్వాత ఓడిందని ఈసీ ప్రకటన

Advertisement
Advertisement

Nandigram : నందిగ్రామ్ లో ఎవరు గెలిచారు.. అనేదే ప్రస్తుతం పెద్ద సస్పెన్స్ గా మారింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మాత్రం సర్వత్రా ఆసక్తిని కలిగించాయి. మరోసారి దీదీ పశ్చిమ బెంగాల్ లో విజయబావుట ఎగురవేసింది. అయితే.. నిజానికి తనద భవానీపూర్ నియోజకవర్గం. ఇదివరకు చాలాసార్లు తన సొంత నియోజకవర్గం నుంచే మమత పోటీ చేసింది. కానీ.. ఈసారి మాత్రం తన నియోజకవర్గం కాదని… వేరే నియోజకవర్గం నందిగ్రామ్ లో పోటీ చేసింది.

Advertisement

not mamata banerjee, suvendu adhikari wins in nandigram

దానికి కారణం… తన పార్టీ నుంచి వెళ్లి పోయి బీజేపీలో చేరిన సువేందు అధికారి. ఆయన బీజేపీలో చేరడంతో ఆయనకు నందిగ్రామ్ నుంచి బీజేపీ టికెట్ లభించింది. దీంతో… ఆయన్ను ఎలాగైనా ఓడించాలని.. మమత నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అయితే… మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన మమత.. చివరి రౌండ్లలో వెనుకపడ్డారు. నిజానికి పశ్చిమ బెంగాల్ లో అత్యధిక సీట్లను మమత గెలుచుకున్నారు. తన పార్టీనే అధికారంలోకి వచ్చింది. కానీ… మమత గెలుస్తుందా? లేదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో.. చివరి రౌండ్ల లెక్కింపు ముగిసిందని… మమతా బెనర్జీ 1200 ఓట్ల మెజారిటీతో గెలిచిందని ఈసీ ప్రకటించింది. దీంతో టీఎంసీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

Advertisement

ఆతర్వాత.. లేదు లేదు.. మమత గెలవలేదు.. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి అధికారి సువేందు గెలిచారు… అంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో టీఎంసీ నేతలు బిత్తరపోయారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లోనూ అధికారి సువేందు గెలిచినట్టు ఉంది. అధికారి సువేందుకు 62677 ఓట్లు వచ్చాయని… మమతా బెనర్జీకి 52815 ఓట్లు వచ్చాయని.. సీపీఐ పార్టీకి చెందిన మీనాక్షీ ముఖర్జీకి 3521 ఓట్లు వచ్చాయని అందులో పేర్కొన్నారు.

not mamata banerjee, suvendu adhikari wins in nandigram

Nandigram : ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రతినిధిలా పనిచేస్తోంది..

అయితే.. ముందు తాను గెలిచానని చెప్పి.. ఆ తర్వాత సువేందు గెలిచారని చెప్పడం.. ఎన్నికల కమిషన్ తీరుకే మచ్చగా ఉందని మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్.. బీజేపీకి ప్రతినిధిలా పనిచేస్తోంది. దీనిపై నేను సుప్రీంకోర్టుకు కూడా వెళ్తా. నందిగ్రామ్ లో ఓడినా కూడా టీఎంసీ 221 కు పైగా సీట్లను సాధించింది. ఇది చాలు మాకు… బీజేపీని కట్టడి చేయడంలో మేం సఫలం అయ్యాం.. అని మమతా బెనర్జీ తెలిపారు.

Recent Posts

Anasuya Bharadwaj : దుస్తుల వ్యాఖ్యల నుంచి చీర ఛాలెంజ్ వరకూ.. అనసూయ-శివాజీ వివాదం కొత్త మలుపు..!

Anasuya Bharadwaj : దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు…

3 hours ago

Sankranti Holidays : తెలంగాణ విద్యార్ధుల‌ పేరెంట్స్ ఆందోళన.. సంక్రాంతి సెలవులు పొడిగించాలంటూ డిమాండ్

Sankranti Holiday : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వారం రోజుల ముందే మొదలైన పండుగ సందడి భోగి,…

5 hours ago

Sankranti Festival : సంక్రాంతి కోడిపందాలతో కోటీశ్వ‌రులుగా మారిన వైనం… రూ.1.53 కోట్ల పందెంతో జిల్లాలో కొత్త రికార్డు

Sankranti Festival : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరోసారి కోడిపందాలతో సందడిగా మారింది. పండుగ రెండో…

6 hours ago

Central Budget 2026 : ఈ బడ్జెట్ అయినా రైతులకు మేలు చేస్తుందా..? పీఎం కిసాన్ పై భారీ ఆశలు..!

Central Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ముఖ్యంగా పీఎం కిసాన్…

7 hours ago

Mana Shankara Vara Prasad Garu Movie : బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ‘మన వరప్రసాద్ ‘.. అది మెగా రేంజ్ అంటే..!

Mana Shankara Vara Prasad Garu Movie : మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు వేటను…

8 hours ago

Bhartha Mahasayulaki Wignyapthi Movie : సంక్రాంతి టైములో ఎంత దారుణమైన కలెక్షన్ల ..? ఏంటి రవితేజ ఇది ?

Bhartha Mahasayulaki Wignyapthi Movie : మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం “ భర్త మహాశయులకు విజ్ఞప్తి…

8 hours ago

Ys Jagan Jr Ntr : 2029 ఎన్నికల్లో జగన్-ఎన్టీఆర్ లను కలిపేది అతడేనా..?

Ys Jagan Jr Ntr : ఏపీ రాజకీయాల్లో 2029 ఎన్నికల వ్యూహాలకు సంబంధించి అప్పుడే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా…

14 hours ago