Categories: News

Valchar : దారుణంగా ప‌డిపోయిన రాంబ‌దుల సంఖ్య‌.. పెరుగుతున్న మాన‌వ మ‌ర‌ణాలు..!

Valchar : ఇదేంటి రాంబ‌దుల సంఖ్య త‌గ్గిపోవ‌డానికి మాన‌వ మ‌ర‌ణాలు పెర‌గ‌డానికి సంబంధం ఏంటీ అనుకుంటున్నారా? ఇదే అంశాన్ని ఈ ఆర్టిక‌ల్‌లో క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ మ‌ధ్య కాలంలో మీరెప్పుడైనా రాబందుల‌ను చూశారా? అఫ్‌కోర్స్ చూసి ఉండర‌నే అనుకుంటున్నా. ఎందుకంటే 98 శాతం రాబందులు ఇప్ప‌టికే అంత‌రించిపోయాయి. ఉన్న‌వి కాస్త మాన‌వ కార్య‌క‌లాపాల‌కు బ‌య‌ప‌డి ఎక్క‌డెక్క‌డో సంచ‌రిస్తున్నాయి. రాబందుల మ‌ర‌ణాలు పెర‌గ‌డం కార‌ణంగా ఇండియాలో 2000-2005 మ‌ధ్య కాలంలో వైర‌స్‌లు వ్యాప్తి చెంది వేల‌ మంది చ‌నిపోయారంటే మీరు న‌మ్ముతారా ? అస‌లు రాబందులు చ‌నిపోతే మ‌నుషులు ఎందుకు చ‌నిపోతున్నారు ?. శ‌వాల‌ను పీక్కుతినే ఈ ప‌క్షులు మ‌నుషుల‌ను ఎలా కాపాడుతాయి ?

ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి, వైర‌స్‌ల నుంచి.. మ‌న ప‌రిస‌రాల్లో రాబందులు స్కావెంజ‌ర్లుగా ప‌ని చేస్తుంటాయి. ఇవి చ‌నిపోయిన జంతువుల‌ను తింటుంటాయి. అంటే చ‌నిపోయిన జంతువుల శరీరాల నుంచి వైర‌స్‌లు వ్యాపించ‌కుండా కీ రోల్ పోషిస్తుంటాయి. రాబందులే లేక‌పోతే చ‌నిపోయిన జంతువుల క‌ళేబ‌రాలు కుళ్లి వైర‌స్‌లు వ్యాపిస్తుంటాయి.మ‌న దేశంలో ఒక‌ప్పుడు రాబందులు పెద్ద సంఖ్య‌లో క‌నిపించేవి. చ‌నిపోయిన జంతువుల క‌ళేబ‌రాలు వెతుకుతూ ఆకాశంలో ఎగురుతుండేవి. కానీ గ‌త రెండు ద‌శాబ్ధాలుగా మ‌న దేశంలో రాబందుల సంఖ్య బాగా త‌గ్గిపోయింది. 1990 పిరియ‌డ్‌లో దాదాపు 5 కోట్ల రాబందులు ఉండేవి. కానీ ప్ర‌స్తుతం వాటిలో 98 శాతం చ‌నిపోయాయి. దీనికి కార‌ణం ప‌శువుల ట్రీట్‌మెంట్‌కు వాడే మందులు కార‌ణ‌మ‌ని శాస్త్ర‌వేత్తలు పేర్కొంటున్నారు. ప‌శువుల‌కు వాడే పెయిన్ కిల్ల‌ర్స్, నాన్ స్టెరాయిడ‌ల్స్‌, డైక్లో ఫినాక్ వంటి మందులు రాబందుల‌కు ప్రాణాంతకంగా మారాయి. వీటి కార‌ణంగా చాలా రాబందులు కిడ్నీ ఫెయిల్ అయి చ‌నిపోతున్నాయి. దీని కార‌ణంగా ప‌శువుల‌కు డైక్లో ఫినాక్ వాడ‌కం ఆపేయాల‌ని చెప్పి 2006లొ బ్యాన్ విధించించారు. దాంతో కొన్ని ప్రాంతాల్లో రాబందుల మ‌ర‌ణాలు త‌గ్గాయి. కానీ ఇప్ప‌టికే రాబందుల సంఖ్య త‌గ్గిపోయిన‌ట్లు స్టేట్ ఆఫ్ ఇండియా బ‌ర్డ్స్ పేర్కొంది.

ప‌శువుల భారీ క‌ళేబారాల‌ను తినే ఈ ప‌క్ష‌లు చ‌నిపోవ‌డంతో డేంజ‌ర‌స్ బ్యాక్టిరియాలు, ఇన్‌ఫెక్ష‌న్లు పెరిగిపోయాయని అమెరిక‌న్ ఎక‌నామిక్ అసోసియేష‌న్ తెలిపింది. ఈ రిపోర్ట్ ప్ర‌కారం ఇండియాలో 2000-2005 మ‌ధ్య కాలంలో ల‌క్ష మందికి పైగా జ‌నాలు వైర‌స్‌లు సోకి చ‌నిపోయార‌ని ఈ రిపోర్ట్‌లో తేలింది. ప్ర‌జ‌ల ఆరోగ్యం కాపాడ‌డంలో రాబందుల పాత్ర చాలా ఎక్కువ‌గా ఉంది. రాబందుల జ‌నాభా ప‌డిపోయిన త‌ర్వాత మ‌న దేశంలో కొన్ని ప్రాంతాల్లో మ‌నుషుల మ‌ర‌ణాల సంఖ్య 4 శాతం పెరిగిందని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. అయితే ఇవి బాగా త‌గ్గిపోయిన 2000-2005 మ‌ధ్య కాలంలో హ్యుమ‌న్ డెత్ రేట్ పెరిగింది. ప్ర‌తి ఏడాది అద‌నంగా ల‌క్ష మంది చ‌నిపోవ‌డానికి ఇదే కార‌ణ‌మని రీసెర్చ‌ర్స్ చెబుతున్నారు. దీనివ‌ల్ల‌ మ‌న దేశం ఏడాదికి రూ.5,77,754 న‌ష్ట పోయింద‌ని రీసెర్చ‌ర్స్ చెబుతున్నారు.

Valchar : దారుణంగా ప‌డిపోయిన రాంబ‌దుల సంఖ్య‌.. పెరుగుతున్న మాన‌వ మ‌ర‌ణాలు..!

కుక్క‌లు కూడా చ‌నిపోయిన జంతువుల క‌ళేబ‌రాలు తింటాయి. కాక‌పోతే రాబందుల మాదిరి ప‌రిస‌రాల నుంచి అంత ఎఫెక్ట్‌గా బ్యాక్టీరియాను తుడిచివేయ‌లేవు. అంతేకాకుండా కుక్క‌లు ఈ క‌ళేబ‌రాలను స‌రిగ్గా తిన‌క‌పోవ‌డం వ‌ల్ల, వాటిని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌డేయ‌డంతో మ‌నం తాగే నీళ్ల‌లో పాథోజ‌న్లు, బ్యాక్టీరియాలు పెరుగుతాయి. రాబందులు చ‌నిపోయిన త‌ర్వాత డ్రింకింగ్ వాట‌ర్‌లో హానికార‌క బ్యాక్టీరియాలు రెండింత‌లు పెరిగిన‌ట్లు ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి. అయితే రాబందుల మ‌ర‌ణానికి ప‌శువుల‌కు వాడే మందులు ఒక్క‌టే కార‌ణం కాదు. అభివృద్ధి పేరుతో మాన‌వ కార్య‌క‌లాపాలు పెరుగ‌డం, అట‌వీ స‌మ‌తుల్య‌త దెబ్బ‌తిన‌డం వంటివి కూడా కార‌ణాలుగా ఉన్నాయి. ఇటీవ‌ల జ‌రిపిన స‌ర్వేలో ద‌క్షిణ భార‌తదేశంలో 300 పైగా రాబందులు ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ కార‌ణాల నేప‌థ్యంలో కొవిడ్ వంటి మ‌హమ్మారిలు మాన‌వాళిని తుడిచిపెట్ట‌క‌ముందే వ‌న‌రుల‌ను, వ‌న్య ప్రాణుల‌ను కాపాడేందుకు అంతా క‌లిసి ప‌టిష్ట‌ చ‌ర్య‌లు తీసుకోవాలి.

Share
Tags: Valchar

Recent Posts

Vinayaka Chavithi 2025 : మీరు వినాయకుని ప్రతిష్టించాలి అనుకుంటే… ఈ నియమాలు తప్పనిసరి… పాటించకుంటే ఫలితం దక్కదు …?

Vinayaka Chavithi 2025 : ఈ సంవత్సరము కూడా ఎంతో వైభవంగా ప్రజలందరూ వినాయక చవితిని వీధి వీధినా,వాడవాడనా, ఊరు…

5 hours ago

Nidigunta Aruna : అడ్డంగా బుక్కైన నెల్లూరు నెరజాణ..ఇక ఎవరెవరి జాతకాలు బయటకొస్తాయో ?

Nidigunta Aruna Arrest : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ నిడిగుంట అరుణ…

14 hours ago

IT Develop in India : దేశ వ్యాప్తంగా ఈరోజు ఐటీ అభివృద్ధి చెందిందంటే దానికి కారణం రాజీవ్ గాంధే – రేవంత్

IT Develop in India : ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర…

15 hours ago

Disabled Persons : ఈ సర్టిఫికేట్ ఒక్కటి చాలు ఉద్యోగాలు , ప్రభుత్వ పథకాలు ఇలా అన్ని మీకే..!!

Sadarem Certificate : సదరం సర్టిఫికెట్ అనేది శారీరక లేదా మానసిక లోపాలతో బాధపడుతున్న దివ్యాంగులకు ప్రభుత్వం అందించే అత్యంత…

16 hours ago

BSF : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పని చేయాలనుకుంటున్నవారికి శుభవార్త

BSF Tradesman Posts 2025 : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 2025 సంవత్సరానికి సంబంధించి భారీ స్థాయిలో నియామక…

17 hours ago

Cooking Oil : పండగలు వస్తున్న తరుణంలో సామాన్య ప్రజలకు భారీ షాక్..

Cooking Oil Prices Hike : పండుగ సీజన్‌కి ముందు సామాన్యులకి షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. వినాయక చవితి,…

18 hours ago

Prabhas- Anushka | 8 సంవ‌త్స‌రాల త‌ర్వాత జంట‌గా క‌నిపించ‌నున్న అనుష్క‌- ప్ర‌భాస్‌.. ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Prabhas- Anushka | టాలీవుడ్‌లో హిట్ జోడీ ప్రభాస్ – అనుష్క పేర్లు ఎప్పుడు వార్త‌ల‌లో నిలుస్తుంటాయి. బిల్లా, మిర్చి,…

19 hours ago

Aisa Cup 2025 | ఆసియా కప్ 2025 జట్టుపై తీవ్ర విమ‌ర్శ‌లు.. ఇదేం జ‌ట్టు అని తిట్టిపోస్తున్న మాజీలు

Aisa Cup 2025 | సెప్టెంబర్ 9న ప్రారంభంకానున్న ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ ప్రకటించిన భారత టీముపై…

20 hours ago