Election Results 2024 : ఓవర్ కాన్ఫిడెన్స్ మా కొంపముంచింది – కేటీఆర్ కీలక వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Election Results 2024 : ఓవర్ కాన్ఫిడెన్స్ మా కొంపముంచింది – కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

 Authored By sudheer | The Telugu News | Updated on :3 September 2025,6:37 pm

Election Results 2024 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ తమ కొంప ముంచిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి మరీ నిజాయితీగా ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Election Results 2024

గత పదేళ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో తెలంగాణ అనేక అద్భుతాలు సాధించిందని కేటీఆర్ అన్నారు. దేశంలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. అయితే గత 21 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా రైతులు యూరియా సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వ్యవసాయ రంగం నష్టపోతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు నిరాశకు గురయ్యారని, మార్పు కోసం ఎదురుచూస్తున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై కూడా కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై పోరాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశం బీఆర్ఎస్ పార్టీని పునరుత్తేజం చేయడానికి, భవిష్యత్ లో ప్రజా ఉద్యమాలకు సన్నద్ధం కావడానికి ఒక వేదికగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది