
cbn
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు విడతల్లో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎవరి బలం ఏమిటో దాదాపుగా తెలిసిపోయింది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల సత్తా ఏమిటో అందరికి తెలిసింది. ఎన్నికలు జరుగుతున్నా సమయంలో ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు లెక్కలు ప్రకటించుకున్న కానీ, చివరికి వచ్చే సరికి ఏ పార్టీ సానుభూతి పరులు ఎంత మంది గెలిచారో లెక్కలు తేలాయి.
పంచాయితీ ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు గట్టిపట్టు పట్టి మరి ముందుకు వెళ్ళాడు, దానికి కారణం తమకు అనుకూలమైన వ్యక్తి ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్నాడు కాబట్టి తమకు కొంచం ఎడ్జ్ ఉండవచ్చు అనే కోణంలో ఆలోచించాడు. ఆ వ్యక్తి టీడీపీ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న కానీ జనం మాత్రం జగన్ వైపే ఉన్నారనే విషయం తేలిపోయింది. కులపు ఓట్లతో గట్టెక్కిన చోట్ల మినహాయిస్తే.. పల్లెలన్నీ వైసీపీ పాలనలో సంతోషంగా ఉన్నాయి. ఏకగ్రీవాలు కానిచోట్ల వైసీపీతో వైసీపీ అభ్యర్థులే పోటీ పడ్డారు కానీ, టీడీపీకి అవకాశమే ఇవ్వలేదు.
ఇక ముఖ్యంగా కుప్పంలో పార్టీ ఓడిన తర్వాత బాబులో ఒక రకమైన అసంతృప్తి కనిపించింది. వైసీపీ గెలుపుని పరోక్షంగా ఒప్పుకుంటూనే, ప్రజాస్వామ్యం ఓడిందని కొత్త లాజిక్ చెప్పేశారు. పంచాయితీ ఎన్నికల కోసం పట్టుపట్టిన బాబు, అసలు మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల గురించి ఒక్క మాటయినా ఆయన మాట్లాడలేకపోతున్నారు. దానికి కారణం తమ పార్టీ పరిస్థితి ఏమిటో ఆయనకు పూర్తిగా క్లారిటీ వచ్చింది.
మరో పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి రాష్ట్రంలో సొంతగా ఒక ఒక పట్టుమని పది సర్పెంచ్ స్థానాలు గెలిచే సరికి ఆ పార్టీకి కొత్తగా జవసత్వాలు వచ్చినట్లు ఆయన భావిస్తున్నారు. అదే ఊపులో పరిషత్ ఎన్నికల కోసం నానా యాగీ చేస్తున్నారు. ఏకగ్రీవాల పోస్టుమార్టం కోసం ప్రయత్నించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఆల్రెడీ కోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నారు. ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నిర్ణయమే ఫైనల్ అని, ఫామ్-10 స్వీకరించిన విజేతల స్థానాలపై ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించొద్దని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. కొత్త నోటిఫికేషన్ అంటే.. విజేతలకు ఇచ్చిన ఫామ్-10 లకు విలువ లేనట్టే లెక్క.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేష్ విడుదల చేయాలంటూ పట్టుబడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ విషయంలో జరిగిన అన్యాయలపై ఫిర్యాదులు చేస్తే అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. కోర్టు ఏకగ్రీవాల విషయంలో అంత సృష్టమైన తీర్పు ఇచ్చిన కానీ పవన్ కళ్యాణ్ ఏ కోణంలో మాట్లాడుతున్నాడో అర్ధం కావటం లేదు
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.