అమరావతి జనభేరి సభలో పవన్ కళ్యాణ్ మిస్సింగ్? ఆహ్వానం అందలేదా?

Advertisement
Advertisement

ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అంటే అమరావతి జనభేరి సభే. అవును.. అమరావతి జనభేరి సభలో ఎక్కవగా హడావుడి చేసింది టీడీపీ పార్టీనే. టీడీపీ ముందుండి జనభేరిని విజయవంతం చేసింది. కాకపోతే టీడీపీ పార్టీ కండువాలను కాకుండా.. అమరావతి ఉద్యమ కండువాలను కప్పుకొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ సభలో హైలెట్ అంటే చంద్రబాబు నాయుడే.

Advertisement

pawan kalyan missing in amaravati jana bheri sabha

టీడీపీ.. అమరావతి ఉద్యమానికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపినప్పటికీ.. బీజేపీ, వామపక్ష పార్టీలు కూడా ఏదో తాము కూడా మద్దతు ఇస్తున్నాము అన్నట్టుగా వ్యవహరించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో నామ్ కే వాస్తే హాజరయింది.

Advertisement

ఇక.. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అసలు వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నుంచి మాత్రం ఎవ్వరూ హాజరుకాలేదు. అసలు.. జనసేన పార్టీ అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తుందా? లేదా? అనే విషయం మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.

నిజానికి.. అమరావతి ఉద్యమం వెనుక ఉన్నది టీడీపీ పార్టీనే. అది జగమెరిగిన సత్యం. మూడు రాజధానుల ప్రకటనను టీడీపీతో పాటు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా జై అమరావతి అని నినదించారు. అమరావతికి సంబంధించి ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్ కూడా దాఖలు చేసింది.

కానీ.. తీరా ఇప్పుడు చూస్తే.. అసలు జనసేన పార్టీ నేతలు కానీ.. అధినేత కానీ దరిదాపుల్లో కూడా రాలేదు. ఎవ్వరూ కనిపించలేదు.

ఆహ్వానం అందలేదా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జనభేరి సభకు ఆహ్వానం అందలేదు.. అనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అమరావతి రైతులు అన్ని పార్టీలకు ఆహ్వానం అందించారట. అంటే.. జనసేనకు కూడా ఆహ్వానం అందింది.. వాళ్లకు ఆహ్వానం అందలేదు అనేది అవాస్తవం అని ఉద్యమ రైతులు చెబుతున్నారు. అంటే.. ఆహ్వానం అందినా పార్టీ లైట్ తీసుకుందంటే.. దానికి కారణం ఏంటి.. అనే విషయం తెలియాల్సి ఉంది.

బాబు పక్కన కూర్చోవాల్సి వస్తుందనేనా?

ఒకవేళ జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్.. జనభేరి సభకు వెళ్తే.. అక్కడ చంద్రబాబు పక్కన కూర్చోవాల్సి వస్తుందని.. వెళ్లి ఆయన పక్కన కూర్చుంటే మళ్లీ ఏపీ ప్రజల్లో లేనిపోని అనుమానాలు.. ఎందుకు ఇదంతా అని అనుకున్నారో ఏమో.. అందుకే పవన్ లైట్ తీసుకొని ఉంటారు.. అనే వార్తలూ వినిపిస్తున్నాయి.

మరోవైపు తిరుపతి ఉపఎన్నిక కూడా త్వరలో జరగబోతోంది. ఇప్పుడు జై అమరావతి అంటే.. రాయలసీయ ప్రజలు గుర్రుమంటారు. పార్టీ మొత్తాన్ని వాళ్లు పక్కన పెట్టేస్తారు. ఎందుకు మనకు గొడవ అని అనుకున్నారో ఏమో.. అందుకే పవన్ కళ్యాణ్.. అమరావతి ఉద్యమానికి అందుకే దూరంగా ఉన్నారు.. అని సమాచారం.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.