PMSYM New Pension Scheme : వృద్ధ దంపతులకు కేంద్రం కొత్త పెన్షన్ పథకం 72,000.. అర్ధరాత్రి నుంచి అమలు..!
PMSYM New Pension Scheme : కార్మిక రంగంలో పనిచేస్తున్న వారికి పెన్షన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మందన్ పథకం ద్వారా ఇవ్వనున్నారు. ఇది వృద్ధ దంపతులకు ఆర్ధిక భద్రత ఇచ్చేలా ఉంటుంది. ఈ పథకం రెటైర్ అయిన తర్వాత స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. వృద్ధ దంపతులకు వార్షిక పెన్షన్ గా ఏకంగా 72000 రూపాయలు అందిస్తారు. వృద్ధాప్యం లో ప్రాధమిక అవసరాలకు మద్ధతుగా ఇది ఉపయోగపడతాయి. పీఎం.ఎస్.వై.ఎం స్కీఎం కి ప్రతి వ్యక్తికి 100 నెలవారి పెట్టుబడి అవసరం మొత్తం ఒక జంటకు 200 ద్వారా ఈ స్కీన్ లో జాయిన్ అవ్వాలి. ఈ స్కీం ను 30 ఏళ్ల వయసులో మొదలైనట్టే.. పాల్గొన వారికి 1200 డొనేట్ చేయాలి. ఫలితంగా ఒక్కొక్కరికి 36000 లేదా 60 ఏళ్ల వయసులో ప్రతి జంటకు 72000 పెన్షన్ వస్తుంది.
PMSYM New Pension Scheme వ్యవసాయ కార్మికులు కూడా..
దీనికి గల అర్హత ప్రమాణాలు ఏంటంటే.. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తులు.. నెల వారీ 15000 లేదా అంతకంటే తక్కువ సంపాఇంచే వారికి ఈ స్కీం కి అర్హత ఉంటుంది. అంతేకాదు గృహ సహాయకులు, వీధి వ్యాపారులు వీరితో పాటు వ్యవసాయ కార్మికులు కూడా ఈ స్కీం కు అర్హత సాధిస్తారు. దరఖాస్తు దారులు నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్.పి.ఎస్), ఈ.ఎస్.ఐ.సి లేదా ఈ.పి.ఎఫ్.ఓ ద్వారా కవర్ చేయబడని వారు.. ఆదాయపు పన్ను చెల్లింపు దారుడు అవ్వకూడదు.
ఎ స్క్రీం తీసుకున్న వారు 60 ఏళ్ల వయసు వస్తే నెలకు 3000 హామీ పెన్షన్ పొందుతారు. ఐతే చందాదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ లో 50 శాతం లేదా నెలకు 1500 పెన్షన్ వస్తుంది. ఈ స్కీం లో నమోదు చేసుకోవడానికి అర్హులైన వారు మొబైల్ నంబర్, బ్యాంక్ సేవింగ్ ఖాతా, ఆధార్ నంబర్ తో కామన్ సర్వీస్ సెంటర్ (సీ.ఎస్.సీ)కి వెళ్లి స్వీయ ధృవీకరణ ద్వారా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

PMSYM New Pension Scheme : వృద్ధ దంపతులకు కేంద్రం కొత్త పెన్షన్ పథకం 72,000.. అర్ధరాత్రి నుంచి అమలు..!
కార్మికుల పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో ఆర్ధిక స్వాతంత్రం పొందేందుకు, ఇతరులపై ఆధారపడకుండా పీఎం.ఎస్.వై.ఎం ద్వారా భద్రత ఏర్పాటు చేస్తుంది.