Polavaram : పోలవరం విషయంలో జగన్‌ కూడా అదే పద్దతి.. ఇక న్యాయం ఎక్కడుంది?

Polavaram  ఏపీ ప్రజలు పోలవరం ప్రాజెక్ట్‌ కోసం రెండున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌ పూర్తి అయితే ఎంతో ప్రయోజనం అంటూ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుండి మొదలుకుని ఇప్పుడు ఉన్న వైఎస్ జగన్ మోహన్‌ ప్రభుత్వం వరకు ఎన్నో విధాలుగా Polavaram  ప్రాజెక్ట్‌ ను దాటవేస్తూ వస్తున్నారు. కొందరు చేస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చి పనులు జరుగుతున్నట్లుగా ఏదో హడావుడి చేస్తున్నారు. కాని ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లుగానే పరిస్థితి ఉంటుంది. ప్రతి ప్రభుత్వం కూడా అదుగో మేము చేస్తున్నాం.. ఇదిగో ముగింపు దశకు వచ్చిందని చెబుతున్నారు. గత ప్రభుత్వం కమీషన్‌ ల కోసం ఈ ప్రాజెక్ట్‌ విలువను భారీగా పెంచేశారు అంటూ జగన్ ప్రభుత్వం ఆరోపించి రివర్స్ టెండరింగ్‌ ను తీసుకు వచ్చింది.

Polavaram జగన్ చేసింది కూడా అదే..

కొత్త టెండర్లను పిలవడం ద్వారా రూ.750 కోట్ల రూపాయలను ఆదా చేశామంటూ చెప్పుకుంటున్నారు. జగన్‌ ప్రభుత్వం పోలవరం ను మళ్లీ అంచనా వ్యయం పెంచకుండా ఈ టెండర్లతోనే పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో పోలవరం Polavaram  అంచనా విలువ భారీగా పెరిగిందని.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కమీషన్ ల కోసం ఆ విధంగా అంచనా వ్యయం పెంచారంటూ ఆరోపణలు వినిపించాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు ను ఫాలో అయ్యి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కూడా ప్రాజెక్ట్‌ అంచనా వ్యయంను పెంచేశాడు.

polavaram estimates have been raised

Polavaram రాత్రికి రాత్రే జీవో…

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాత్రికి రాత్రే కొత్త జీవోను తీసుకు వచ్చి ఏకంగా 3200 కోట్ల మేరకు పెంచుతూ అంచనా వ్యయంను ఖరారు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాల వారు ప్రకటించారు. మట్టి ఇసుక ఇలా అన్నింటి వ్యయం పెరగడం వల్ల అంచనా వ్యయం పెంచినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం అంచనా వ్యయం పెంచడం పట్ల ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి వ్యతిరేకుల రంగంలోకి దిగారు. తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు ఇతర పార్టీల నాయకులు కూడా పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఎంత వర్క్ అయ్యిందో చెప్పాలంటూ జగన్ ను జనాలు ప్రశ్నిస్తున్నారు.

Recent Posts

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

41 minutes ago

Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ..!

Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…

2 hours ago

Kommineni Srinivasa Rao Arrest : ఏపీలో సంచ‌ల‌నం.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.…

3 hours ago

Summer Eye Care : ఎండాకాలంలో మీ కళ్ళు జర భద్రం… లేదంటే సమస్యలు తప్పవు… కళ్ళు పోతాయి సుమా…?

Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…

3 hours ago

Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌… ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…

4 hours ago

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

5 hours ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

6 hours ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

7 hours ago