Categories: News

Parents : సొంత త‌ల్లిదండ్రుల‌పై ఖాకీ జులుం.. అధికార మ‌దంలో క‌న్న‌వారికే చిత్ర హింస‌లు..!

Advertisement
Advertisement

Parents : బాధ్యత గల పోలీసు ఉన్నతాధికారి అయి ఉండి, అన్యాయం జరిగిందని తమ దగ్గరకి వచ్చేవారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న వ్య‌క్తి అయి ఉండి ఆస్తుల కోసం కన్నతల్లిదండ్రులను వేధింపులకు గురి చేశాడు ఓ అధికారి. తన పలుకుబడితో వారికి నరకం చూపిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన సదరు పోలీసు అధికారి తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని ఆశ్రయించారు. కొడుకు వేధింపులు తట్టుకోలేకపోతున్నామని.. మీరే మమ్మల్ని రక్షించాలని డీజీపీ జితేందర్‌ను వేడుకున్నారు. కని, పెంచి, ఓ ప్రయోజకుడిని చేసిన తల్లిదండ్రులనే అధికార మదంతో చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.

Advertisement

Parents వాడు కొడుకేనా..

అన్నయ్య తప్పుడు వ్యవహారం తెలిసిన తమ్ముడు.. మంచి పద్ధతి కాదని వారించి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినా.. కఠిన ఖాకీ హృదయం చలించలేదు. విసిగివేసారిన ఆ తల్లిండ్రులు ఏకంగా పోలీస్‌ బాస్‌ను కలిసి తమ మొర ఏకరువు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం, వెంకటాయింపల్లికి చెందిన రఘునాథ్‌రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు నాగేశ్వర్‌రెడ్డి రాచకొండ కమిషనరేట్‌లో ఓ స్టేషన్‌ సీఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మల్టీ జోన్‌ 2లో విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు యాదయ్య కూడా పోలీసు శాఖలోనే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కూతుళ్లు ఇద్దరికి పెళ్లిళ్లు చేశాడు.

Advertisement

Parents : సొంత త‌ల్లిదండ్రుల‌పై ఖాకీ జులుం.. అధికార మ‌దంలో క‌న్న‌వారికే చిత్ర హింస‌లు..!

రఘునాథ్‌రెడ్డికి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమిలో.. పెద్దకొడుకు పేరున 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరున 11 ఎకరాలు పట్టాచేశాడు. మిగిలిన భూమిని కూతుళ్లకు ఇచ్చేందుకు తమ పేరున ఉంచుకున్నారు. ఈ భూమిపై పెద్దకొడుకు, సీఐ నాగేశ్వర్‌రెడ్డి కన్ను పడింది. తన పేరున ఇంకో 5 ఎకరాలు పట్టా చేయాలని వృద్ధులైన తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ పలుమార్లు దాడి చేశాడు. పెద్ద కొడుకు వేధింపులు తాళలేక చిన్న కొడుకు యాదయ్య ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఈ విషయాలన్నీ డీజీపీ జితేందర్‌కు ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ మొరపెట్టుకున్నారు. తన కొడుకు నాగేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.