Post Office Scheme : ప్రస్తుత కాలంలో డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం కష్టపడేది డబ్బు కోసం. డబ్బు తోనే మన పొట్ట నింపుకోగలుగుతాం. పూర్వపు రోజుల్లో వస్తువులను ఇచ్చిపుచ్చుకొని ఆహార పదార్థాలను సేవించేవారు. కానీ ఇప్పుడు ప్రతిదీ డబ్బుతో కొనుక్కొని తినడమే. అందుకే డబ్బును దాచుకోవడం చాలా ముఖ్యం. డబ్బు ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం కంటే దానిని దాచుకుంటే భవిష్యత్తులో ఏమైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి అనారోగ్య సమస్యలు, పిల్లల చదువులు వివాహాలకు డబ్బు అవసరం వస్తుంది. అందుకే డబ్బులు పొదుపు చేయడం ఉత్తమం. అందుకే ప్రభుత్వ రంగ సంస్థ పోస్ట్ ఆఫీస్ అందించే పొదుపు
పథకాలను ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రాబడి పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న అనేక పథకాల్లో ఒకటి కిసాన్ వికాస్ పత్ర ఒకటి. ఈ పథకంలో ఎంత అయితే పెట్టుబడి పెడతామో దానికి డబల్ అమౌంట్ ని రిటర్న్ గా పొందవచ్చు. కిసాన్ వికాస్ పత్ర పథకంలో లక్ష రూపాయల పెట్టుబడి పెడితే 2లక్షలు పొందవచ్చు. అదే రెండు లక్షలు పెట్టుబడి పెడితే నాలుగు లక్షలు తిరిగి పొందవచ్చు. అయితే సమయం ఎక్కువ పడుతుంది. కాస్త సమయం ఎక్కువైనా సరే ఈ పథకంలో మంచి రాబడిని పొందవచ్చు. ఈ పథకం జీవితకాలం 10 సంవత్సరాల నాలుగు నెలలు. ఇటీవల ఈ స్కీమ్ వడ్డీ రేటును కూడా పెంచింది.
గతంలో ఈ పథకలో 6.9% ఉన్న వడ్డీ 7% శాతానికి పెంచింది. ఇలాంటి పథకాలను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వడ్డీ రేటును పెంచుతూ ఉంటుంది. మరి కొన్నిసార్లు వడ్డీని అలాగే ఉంచుతుంది. ఈ పథకంలో గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పొదుపు చేయవచ్చు కానీ కనీస పెట్టుబడి రూ.1000 ఉండాలి. అలాగే 2000, 3000, 4000 ఇలా ఎంత డబ్బైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టిన పది సంవత్సరాల నాలుగు నెలలకు రెట్టింపు అవుతుంది. ఈ పథకంతో మంచి ఆదాయం రావడం గ్యారంటీ.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.