
Ration Card holders Have To Follow The Central Government Rules
Ration Card : దేశంలో రేషన్ కార్డు దారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైతే కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలను పాటిస్తారో వారికి మాత్రమే ప్రభుత్వాలు అందించే ఉచిత రేషన్, సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందవచ్చును. లేనియెడల వారిపై కఠిన చర్యలు తప్పవని దీని సారాంశం. సాధారణంగా పన్ను చెల్లింపులు చేయలేని వారికి.. ఆదాయ మార్గాలు తక్కువగా ఉండి.. పేదరికం అనుభవిస్తున్న వారు మాత్రమే దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రేషన్ కార్డులను కలిగి ఉండటానికి అర్హులు.అయితే కొందరు పన్ను చెల్లించే స్థోమత కలిగిన వారు, ఆదాయ మార్గాలు ఉన్న వారు కూడా మనదేశంలో అక్రమంగా రేషన్ కార్డులను కలిగి ఉన్నారని వీరి ద్వారా అసలు లబ్దిదారులకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదని కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రేషన్ కార్డులు ఎవరు కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉండకూడదో ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొంది. ఒకవేళ అనర్హులు కార్డులను సరెండర్ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000లోపు ఆదాయం ఉన్న వారు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు మాత్రమే కార్డులు తీసుకోవడానికి అర్హులు.
Ration Card holders Have To Follow The Central Government Rules
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలలోపు ,పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు ఆదాయం వచ్చే వారికే రేషన్ కార్డు వర్తిస్తుంది. మాగాణి భూములు 3.5ఎకరాల్లోపు ఉన్నవారు, బీడు భూములైతే 7.5 ఎకరాల్లోపు ఉన్న వారు రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులు. వంద చదరపు మీటర్ల ఇల్లు, ఫ్లాట్ , కారు, ట్రాక్టర్లు కలిగిన వారు..గ్రామాల్లో రూ.1.5లక్షల కంటే ఎక్కువ ఆదాయం, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం,నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉంటే కార్డులను సంబంధిత ఎమ్మార్వో ఆఫీసులో సరెండర్ చేయాలని ఆదేశించింది.
ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కంట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ చెల్లించని వారు మాత్రమే రేషన్కార్డు పొందడానికి అర్హులని తాజా రూల్స్ స్పష్టం చేస్తున్నాయి.ఎవరైనా ఇలాంటి టాక్సులు కడుతుంటే వారు అనర్హులని స్పష్టం చేసింది. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు రేషన్ కార్డులు పొందడానికి అనర్హులు.గతంలో రేషన్ కార్డు తీసుకున్నవారు ఎవరైనా ఆర్థికంగా స్థిరపడితే సరెండర్ చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.