RBI : అత్యవసరంగా డబ్బు అవసరం అయినా.. బయట ఇంట్రెస్ట్ రేటు అధికంగా ఉంటుందనే కారణంతో చాలా మంది బ్యాంకులు, నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీల దగ్గర నుంచి రుణాలు తీసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకుని.. ప్రతి నెల కొద్ది కొద్దిగా ఈఎంఐ రూపంలో చెల్లించే వెసులుబాటు ఉండటం వల్ల చాలా మంది దీనికే మొగ్గు చూపుతారు. అయితే ఈఎంఐ చెల్లింపుల్లో ఏమాత్రం ఆలస్యం జరిగినా.. ఆయా సంస్థలు కస్టమర్లకు చుక్కలు చూపిస్తాయి. ఫైన్ల పేరుతో భారీగా దండుకుంటాయి. అదుగో వాటికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది.
సాధారణంగా రుణాలు చెల్లించని పక్షంలో బ్యాంకులు వారి ఏజెంట్లని పంపి వాహనాన్ని జప్తి చేయమని వారికి సూచిస్తాయి. ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం ఇప్పటి నుండి ఏ వాహనం కూడా జప్తు చేయబడదు. ఎవరైన అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.రుణ గ్రహీత తన వాహనంపై తీసుకున్న రుణాన్ని తిరిగి ఇవ్వలేనప్పుడు బ్యాంకులు ఆర్ధిక సంస్థలు డబ్బు వసూలు చేయడానికి తమ సేకరణ ఏజెంట్స్ పంపుతాయి. ఒకవేళ మీతో వారు అమర్యాదగా ప్రవర్తిస్తే వారిపై ఫిర్యాదు చేయవచ్చు. ఎఫ్ఐఆర్ ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు లక్ష జరిమానా విధిస్తారు.
సాధారణంగా నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ మెుత్తాన్ని ఆలస్యంగా చెల్లించినందుకు బ్యాంకులు ఖాతాదారుల నుంచి జరిమానా వసూలు చేస్తాయి. అయితే ఆర్బీఐ కొత్త ఆదేశాల వల్ల ఇకపై బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు.. ఈఎంఐ ఆలస్యంపై జరిమానా, వడ్డీని వసూలు చేయకుండా నిరోధిస్తుంది. లోన్ డిఫాల్ట్ సమయంలో వడ్డీ రేటుకు అదనపు ఛార్జీలను జోడించటాన్ని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే నిషేధించింది. పెనాల్టీ ఛార్జీలపై ఎలాంటి అదనపు వడ్డీని వసూలు చేయవద్దని బ్యాంకులను కోరింది. గత కొంత కాలంగా ఇలాంటి సంఘటనలపై ఫిర్యాదులు పెరగటంతో రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగింది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంది.
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…
This website uses cookies.