RBI : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరేళ్ల క్రితం నవంబర్ 8న రాత్రి 8 గంటల సమయంలో దేశంలో 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఆరోజు అర్ధరాత్రి నుంచి అప్పటి వరకు చాలామణిలో ఉన్న 84.5% కరెన్సీ రద్దయింది. ఈ నిర్ణయం వల్ల దేశంలో మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల నల్లధనం మాయమైపోతుందని మోడీ ప్రభుత్వం అనుకుంది. అయినా ఉద్దేశం ఎంత మంచిదే అప్పటికి ఎటువంటి చర్చలు లేకుండా చేపట్టే చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయా ఇవ్వమని నోట్ల రద్దు వ్యవహారంతో తెలిసిపోయింది. దీంతో నల్లధనం ఏమాత్రం తొలగిపోలేదు. అంతేకాకుండా దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. సామాన్య ప్రజలు నోట్ల మార్పిడి కోసం ఎన్నో కష్టాలు పడ్డారు.
అయితే కేంద్ర ప్రభుత్వం 500, 1000 రద్దు అయ్యాక 2000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదే 2000 నోటుకు సంబంధించి తాజాగా ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్ 8న ఆర్బిఐ 2000 నోటును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ నోటు చలామణి తగ్గిపోయింది. ఇప్పుడు ఏటీఎంలో దగ్గర కూడా ఇవి ఎక్కువగా కనిపించడం లేదు. దీనికి గల కారణం గత మూడు సంవత్సరాలలో అంటే 2019-20, 2020-21, 2021-2022 లో 2000 కొత్త నోట్లను ఆర్బిఐ ముద్రించలేదు. తాజాగా ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంతో ఈ విషయం బయటికి వచ్చింది.
ఆర్టిఐ దరఖాస్తుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ నుండి వచ్చిన వివరాల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ముద్రన్ లిమిటెడ్ 2016-17 సంవత్సరంలో 3,5429.91 కోట్ల 2000 రూపాయల నోట్లను, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1115.07 కోట్ల విలువైన 2000 నోట్లను ముద్రించినట్లు తెలిపింది. 2018 -19 సంవత్సరంలో ఆ సంఖ్యను తగ్గించామని 4066.90 కోట్ల నోట్ల మాత్రమే ముద్రించామని తెలిపింది. అయితే 2019 – 20, 2020 – 21, 2021- 22 ఆర్థిక సంవత్సరాలలో మాత్రం 2000 నోట్లను అసలు ముద్రించలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్టిఐ కి సమాధానం ఇచ్చింది. అంటే ఈ మూడు సంవత్సరాలలో ఆర్బిఐ 2000 నోట్లను అస్సలు ముద్రించలేదు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.