Revanth Reddy : మరో యుద్ధం ప్రకటించిన రేవంత్ రెడ్డి… 20 రోజుల్లో పనులు కాకపోతే ఖబడ్ధార్.. రేవంత్ రెడ్డి వార్నింగ్..?

Advertisement
Published by
Advertisement

Revanth Reddy : రేవంత్ రెడ్డి అంటేనే తెలంగాణ ఫైర్ బ్రాండ్. ఆయన పేరుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా… ఆయన తెలంగాణ ప్రజల నాయకుడు. ఆయన ఒక్క పార్టీకే చెందిన నాయకుడు కాదు. ఆయన ప్రజల కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్లో దమ్మున్న నాయకుడంటే రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడంలో దిట్ట. తెలంగాణలో ఏ సమస్య ఉన్నా… డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా చూసే నేత రేవంత్ రెడ్డి.

Advertisement

revanth reddy on tribals issues in adilabad dist

1981 లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన ఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 40 ఏళ్ల క్రితం ఇంద్రవెల్లిలో భూమి, భుక్తి, విముక్తి కోసం ఆనాడు రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓ దుర్ఘటన జరిగింది. ఆ ఘటనలో చాలామంది ఆదివాసీలు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఈ ఘటన జరిగి 40 ఏళ్లు అయినా… ఎన్నో ప్రభుత్వాలు మారినా.. ఇప్పటి వరకు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల ఫ్యామిలీలకు మాత్రం న్యాయం జరగలేదు. అసలు ఆ ఘటనలో ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోయాయి… అనే విషయంపై ప్రభుత్వం వద్ద కూడా సరైన వివరాలు లేవు.. ఈ ఘటన జరిగి ఏప్రిల్ 20 కి 40 ఏళ్లు కావడంతో… కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి… ఇంద్రవెల్లికి వెళ్లి అక్కడి ఆదివాసీలతో మాట్లాడారు.

Advertisement

ఆదివాసీల పోరాటంలో ఎందరో మహనీయులు అమరులు అయ్యారు కానీ… ఇప్పటి వరకు కూడా ఆదివాసీల సమస్యలు పరిష్కారం కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. పోడు భూముల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నో ప్రభుత్వాలు ఇప్పటి వరకు మారాయి కానీ… ఆదివాసీలకు కనీస సౌకర్యాలు లేవు. చివరకు ఇక్కడ మంచినీళ్లు కూడా రావడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు అన్ని చోట్ల ఇస్తున్నాం అని ఓవైపు సీఎం కేసీఆర్ చెబుతున్నారు కానీ… ఇక్కడ చూస్తే మాత్రం చుట్టుపక్కన ఏ గూడాలలో కూడా మంచి నీళ్లు రావడం లేదు. పోడు భూములకు సంబంధించిన సమస్యలను ఇప్పటి వరకు తీర్చలేదు. ఆదివాసీలు దున్నుకుంటున్న భూమికి పట్టా ఇవ్వాలంటూ దశాబ్దాల నుంచి పోరు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఆదివాసీలకు ఇండ్లు లేవు.. ఎటువంటి సౌకర్యాలు లేవు.. అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Revanth Reddy : అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు దాటినా… ఆదివాసీల సమస్యలు పట్టవా?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం… తెలంగాణలోని ఆదివాసీల సమస్యలను తీర్చడానికి మాత్రం వెనకడుగు వేస్తోంది. ఇంద్రవెల్లిలో కనీసం మంచినీళ్లను కూడా ప్రభుత్వం అందించడం లేదు. వెంటనే అధికారుకు ఫోన్ చేశాను. 20 రోజుల్లో ఇంద్రవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను అందించకపోతే… నేను మరో 20 రోజుల తర్వాత నేను ఇక్కడికి వచ్చి అధికారుల, ప్రభుత్వం మెడలు వచ్చి పని చేపిస్తా. మే 15 వరకు నేను ప్రభుత్వానికి సమయం ఇస్తున్నా. ఇక్కడ మంచినీటి సమస్యను లేకుండా చేయాలె. అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలి. పోడు భూములకు సంబంధించిన సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలి. లేదంటే.. నేను మళ్లీ మే 15 తర్వాత ఇక్కడికి వచ్చి… ఇక్కడే ఉంటా… వారం పాటు ఇక్కడే ఉండి… ప్రభుత్వంతో పని చేయిస్తా… అని ఆదివాసీలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Gautam Gambhir : విరాట్ కోహ్లి ప్రస్తావనపై గంభీర్ ఫైర్.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రిపోర్టర్‌కు దిమ్మతిరిగే సమాధానం!

Gautam Gambhir  : భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న శుభతరుణంలో, కోచ్ గౌతమ్ గంభీర్…

3 hours ago

T20 World Cup 2026 : కడుపులో అంత బాధను పెట్టుకొని కూడా జట్టును గెలిపించాడంటే ఇషాన్ రియల్ హీరో !!

T20 World Cup 2026  : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్…

4 hours ago

T20 World Cup 2026 : మైదానం ఏమైనా పడక గది అనుకొన్నావా? .. హార్దిక్ పాండ్యా సరసాల పై నెటిజన్ల ఫైర్

T20 World Cup 2026  : ప్రపంచ టీ20 క్రికెట్ కప్‌లో భారత జట్టు ఘన విజయం సాధించడం దేశవ్యాప్తంగా…

5 hours ago

Nara Brahmani : తండ్రి చూసి వణికిపోయే బాలకృష్ణ ఈ ఒక్క విషయంలో ఎన్టీఆర్‌ని ఎదిరించారు : నారా బ్రాహ్మణి

Nara Brahmani : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తెలుగు…

6 hours ago

TKGKS Maha Dharna  : మార్చి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల మహాధర్నా

TKGKS Maha Dharna  : మార్చి 17న ఇందిరాపార్క్ Indira Park వద్ద గీత కార్మికుల మహాధర్నా రాష్ట్రంలోని గీత…

7 hours ago

Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం నుండి తాజా అప్డేట్..!

Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే…

10 hours ago

Donald Trump : చమురు ధరల పెరుగుదలపై ప్రపంచ మార్కెట్ల ఆందోళన .. గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump : పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా మరియు ఇజ్రాయెల్…

11 hours ago

PM Kisan : పీఎం కిసాన్‌పై తాజా అప్డేట్.. రైతుల అకౌంట్లోకి జమ అయ్యేది అప్పుడే.. కేంద్రం నుంచి క్లారిటీ..!

PM Kisan : పౌరసరఫరాల శాఖ మరియు కేంద్ర ప్రభుత్వం నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది…

12 hours ago

Hardik Pandya : ఆమె నా జీవితంలోకి వచ్చాకే గెలుస్తున్నా .. మరో పదేళ్లు ఏళ్ల క్రికెట్ లక్ష్యం : హార్దిక్ పాండ్యా

Hardik Pandya : టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్…

13 hours ago

Pawan Kalyan : జగన్ మాస్టర్ ప్లాన్ ని అట్టర్ ఫ్లాప్ చేసిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ కీలకంగానే ఉంటాయి. ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఓట్లు ఏ పార్టీ…

15 hours ago

Gold and silver Rate Today March 9 : పసిడి ప్రియులకు శుభవార్త.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!

Gold and silver Rate Today March 9 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు…

15 hours ago