Revanth Reddy : మరో యుద్ధం ప్రకటించిన రేవంత్ రెడ్డి… 20 రోజుల్లో పనులు కాకపోతే ఖబడ్ధార్.. రేవంత్ రెడ్డి వార్నింగ్..?

Advertisement
Advertisement

Revanth Reddy : రేవంత్ రెడ్డి అంటేనే తెలంగాణ ఫైర్ బ్రాండ్. ఆయన పేరుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా… ఆయన తెలంగాణ ప్రజల నాయకుడు. ఆయన ఒక్క పార్టీకే చెందిన నాయకుడు కాదు. ఆయన ప్రజల కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్లో దమ్మున్న నాయకుడంటే రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడంలో దిట్ట. తెలంగాణలో ఏ సమస్య ఉన్నా… డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా చూసే నేత రేవంత్ రెడ్డి.

Advertisement

revanth reddy on tribals issues in adilabad dist

1981 లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన ఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 40 ఏళ్ల క్రితం ఇంద్రవెల్లిలో భూమి, భుక్తి, విముక్తి కోసం ఆనాడు రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓ దుర్ఘటన జరిగింది. ఆ ఘటనలో చాలామంది ఆదివాసీలు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఈ ఘటన జరిగి 40 ఏళ్లు అయినా… ఎన్నో ప్రభుత్వాలు మారినా.. ఇప్పటి వరకు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల ఫ్యామిలీలకు మాత్రం న్యాయం జరగలేదు. అసలు ఆ ఘటనలో ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోయాయి… అనే విషయంపై ప్రభుత్వం వద్ద కూడా సరైన వివరాలు లేవు.. ఈ ఘటన జరిగి ఏప్రిల్ 20 కి 40 ఏళ్లు కావడంతో… కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి… ఇంద్రవెల్లికి వెళ్లి అక్కడి ఆదివాసీలతో మాట్లాడారు.

Advertisement

ఆదివాసీల పోరాటంలో ఎందరో మహనీయులు అమరులు అయ్యారు కానీ… ఇప్పటి వరకు కూడా ఆదివాసీల సమస్యలు పరిష్కారం కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. పోడు భూముల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నో ప్రభుత్వాలు ఇప్పటి వరకు మారాయి కానీ… ఆదివాసీలకు కనీస సౌకర్యాలు లేవు. చివరకు ఇక్కడ మంచినీళ్లు కూడా రావడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు అన్ని చోట్ల ఇస్తున్నాం అని ఓవైపు సీఎం కేసీఆర్ చెబుతున్నారు కానీ… ఇక్కడ చూస్తే మాత్రం చుట్టుపక్కన ఏ గూడాలలో కూడా మంచి నీళ్లు రావడం లేదు. పోడు భూములకు సంబంధించిన సమస్యలను ఇప్పటి వరకు తీర్చలేదు. ఆదివాసీలు దున్నుకుంటున్న భూమికి పట్టా ఇవ్వాలంటూ దశాబ్దాల నుంచి పోరు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఆదివాసీలకు ఇండ్లు లేవు.. ఎటువంటి సౌకర్యాలు లేవు.. అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Revanth Reddy : అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు దాటినా… ఆదివాసీల సమస్యలు పట్టవా?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం… తెలంగాణలోని ఆదివాసీల సమస్యలను తీర్చడానికి మాత్రం వెనకడుగు వేస్తోంది. ఇంద్రవెల్లిలో కనీసం మంచినీళ్లను కూడా ప్రభుత్వం అందించడం లేదు. వెంటనే అధికారుకు ఫోన్ చేశాను. 20 రోజుల్లో ఇంద్రవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను అందించకపోతే… నేను మరో 20 రోజుల తర్వాత నేను ఇక్కడికి వచ్చి అధికారుల, ప్రభుత్వం మెడలు వచ్చి పని చేపిస్తా. మే 15 వరకు నేను ప్రభుత్వానికి సమయం ఇస్తున్నా. ఇక్కడ మంచినీటి సమస్యను లేకుండా చేయాలె. అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలి. పోడు భూములకు సంబంధించిన సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలి. లేదంటే.. నేను మళ్లీ మే 15 తర్వాత ఇక్కడికి వచ్చి… ఇక్కడే ఉంటా… వారం పాటు ఇక్కడే ఉండి… ప్రభుత్వంతో పని చేయిస్తా… అని ఆదివాసీలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Recent Posts

Pomegranate Juice : గుండె ఆరోగ్యానికి దానిమ్మ రసంతో ఎన్ని లాభాలో తెలుసా..?

Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…

35 minutes ago

Zodiac Signs : జ‌న‌వ‌రి 20 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

2 hours ago

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం బహిరంగ…

10 hours ago

Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే త‌ల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!

Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…

11 hours ago

Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్

Renu Desai  : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…

12 hours ago

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…

13 hours ago

ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…

14 hours ago

Youth Kidnap : సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన.. ప్రేమించాడని యువకుడికి మూత్రం తాగించి చిత్రహింసలు

Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…

15 hours ago