Sabitha Indrareddy : మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆయా యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆ దిశగా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. యూనివర్సిటీ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థుల కెరీర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు. ఆయా యూనివర్సిటీల వీసీలతో, సీఎస్, ఉన్నత విద్యా మండలి అధికారులతో సమావేశమైన ఆమె.. ఉద్యోగాల కోసం ట్రైనింగ్, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కోసం యూనివర్సిటీల్లో స్పెషల్ విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రానుందని.. కాబట్టి అందుకు విద్యార్థులను రెడీ చేసేందుకు యూనివర్సిటీలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని వెల్లడించారు. పరిశ్రమలు, పరిశోధనా సంస్థలతో యూనివర్సిటీలు నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీలు.. ప్రైవేట్ యూనివర్సిటీలకు దీటుగా తయారవ్వాలన్నారు. విద్యార్థుల్లో ఎప్పటికప్పుడు ఆత్మస్థైర్యాన్ని నింపాలని సూచించారు.భవిష్యత్తులో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగే కోర్సులను గుర్తించాలని ఆదేశించారు.యూనివర్సిటీలకు పరిశోధనలే ప్రామాణికంగా ఉంటాయన్నారు.
స్టూడెంట్స్కు మెరుగైన బోధన అందించడంలో అవి సహాయపడతాయని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు ఉద్యోగంతోనే బయటకు వెళ్లేలా ప్లాన్ చేయాలని సూచించారు. ఆయా యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా యూనివర్సిటీల్లోని ఖాళీలతో పాటుగా ఆయా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్స్ రాకపోవడంతో చాలా మంది ఏజ్ బార్ అవుతూ అర్హత కోల్పేయే చాన్స్ ఉందని వాపోతున్నారు. ఈ విషయాన్ని సైతం ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్స్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.