Sharmila is going to give a huge shock to KCR
YS Sharmila : తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ఫోకస్ అంతా హుజూరాబాద్ నియోజకవర్గం మీదే ఉంది. అక్కడ బీజేపీ తరపున బరిలోకి దిగబోతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్ను ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున ఎవరు బరిలోకి దిగుతారనే అంశం ఇంకా తేలలేదు. దీనిపై ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక తెలంగాణలో రాజకీయ శక్తిగా మారాలని భావిస్తున్న వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్టీపీ హుజూరాబాద్లో పోటీకి దూరమని ప్రకటించింది.
Sharmila is going to give a huge shock to KCR
అయితే తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఊహించని విధంగా షాక్ ఇవ్వాలని వైఎస్ షర్మిల అండ్ కో నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయాలని కొంతకాలంగా దీక్షలు, నిరసనలు చేస్తున్న వైఎస్ షర్మిల.. హుజూరాబాద్లో నిరుద్యోగులు పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. అయితే తాజాగా ఇదే అంశాన్ని వైఎస్ఆర్టీపీ సీరియస్గా తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న వైఎస్ఆర్టీపీ.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికను వినియోగించుకోవాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో వెయ్యి మందికి పైగా నిరుద్యోగులతో నామినేషన్లు వేయించాలని ఆ పార్టీ నిర్ణయించింది. నిరుద్యోగులతో దగ్గరుండి హుజూరాబాద్లో నామినేషన్లు వేయించాలని వైఎస్ఆర్టీపీ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికార పార్టీపై కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమైతే సరిపోదని.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది.
Sharmila is going to give a huge shock to KCR
ఈ క్రమంలోనే నిరుద్యోగులతో హుజూరాబాద్లో నామినేషన్లు వేయిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకుంటుందని వైఎస్ఆర్టీపీ యోచిస్తున్నట్టు సమాచారం. ఇలా చేయడం వల్ల ప్రజలు, నిరుద్యోగుల్లోనూ పార్టీ పట్ల సానుకూలత వ్యక్తమవుతుందని వైఎస్ షర్మిల అనుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. విపక్షాలు కూడా నిరుద్యోగులతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేసే ఈ చర్యలను తప్పుబట్టలేవని ఆ పార్టీ భావిస్తోంది.
ఇదిలా ఉంటే, వైఎస్సార్టీపీలో .. లుకలుకలు బయటపడ్డాయి.. పార్టీలో కొత్తగా చేరికలు లేకపోగా.. ఉన్న కొందరు నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. ఆ మధ్య పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా ఇందిరా శోభన్ షర్మిలకు హ్యాండ్ ఇచ్చారు. దీంతో అసలు షర్మిల పార్టీ తెలంగాణలో నిలదొక్కుకుంటుందా ? అనే చర్చ జరుగుతోంది.
kcr
అసలు షర్మిల కొత్త పార్టీ ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఎంతమేరకు ఉంటుందన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.. వైఎస్ షర్మిల చరిష్మా ఏ మేరకు ఓట్లు రాల్చుతుందనే విషయంలో క్లారిటీ రాకపోతే.. నేతలెవరూ ఆమె పార్టీ వైపు చూసే అవకాశం ఉండకపోవచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాననే నినాదంతో ముందుకొచ్చిన వైఎస్ షర్మిలకు నేతల రాజీనామాలు గట్టిదెబ్బగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్లో పోటీ చేయకపోయినా.. అధికార టీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలనుకుంటున్న వైఎస్ షర్మిల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.