Categories: NewspoliticsTelangana

YS Sharmila : హుజూరాబాద్ ఎన్నికలను అడ్డం పెట్టుకొని.. కేసీఆర్ కు భారీ షాక్ ఇవ్వబోతున్న షర్మిల?

Advertisement
Advertisement

కేసీఆర్ కు వైఎస్ షర్మిల షాక్

YS Sharmila : తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ఫోకస్ అంతా హుజూరాబాద్ నియోజకవర్గం మీదే ఉంది. అక్కడ బీజేపీ తరపున బరిలోకి దిగబోతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున ఎవరు బరిలోకి దిగుతారనే అంశం ఇంకా తేలలేదు. దీనిపై ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక తెలంగాణలో రాజకీయ శక్తిగా మారాలని భావిస్తున్న వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్‌టీపీ హుజూరాబాద్‌లో పోటీకి దూరమని ప్రకటించింది.

Advertisement

Sharmila is going to give a huge shock to KCR

అయితే తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఊహించని విధంగా షాక్ ఇవ్వాలని వైఎస్ షర్మిల అండ్ కో నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయాలని కొంతకాలంగా దీక్షలు, నిరసనలు చేస్తున్న వైఎస్ షర్మిల.. హుజూరాబాద్‌లో నిరుద్యోగులు పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. అయితే తాజాగా ఇదే అంశాన్ని వైఎస్ఆర్‌టీపీ సీరియస్‌గా తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న వైఎస్ఆర్‌టీపీ.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికను వినియోగించుకోవాలని భావిస్తోంది.

Advertisement

వెయ్యి మందితో ..

ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో వెయ్యి మందికి పైగా నిరుద్యోగులతో నామినేషన్లు వేయించాలని ఆ పార్టీ నిర్ణయించింది. నిరుద్యోగులతో దగ్గరుండి హుజూరాబాద్‌లో నామినేషన్లు వేయించాలని వైఎస్ఆర్‌టీపీ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికార పార్టీపై కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమైతే సరిపోదని.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది.

Sharmila is going to give a huge shock to KCR

ఈ క్రమంలోనే నిరుద్యోగులతో హుజూరాబాద్‌లో నామినేషన్లు వేయిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకుంటుందని వైఎస్ఆర్‌టీపీ యోచిస్తున్నట్టు సమాచారం. ఇలా చేయడం వల్ల ప్రజలు, నిరుద్యోగుల్లోనూ పార్టీ పట్ల సానుకూలత వ్యక్తమవుతుందని వైఎస్ షర్మిల అనుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. విపక్షాలు కూడా నిరుద్యోగులతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేసే ఈ చర్యలను తప్పుబట్టలేవని ఆ పార్టీ భావిస్తోంది.

YS Sharmila :  వైఎస్సార్టీపీకి .. షాక్

ఇదిలా ఉంటే, వైఎస్సార్టీపీలో .. లుకలుకలు బయటపడ్డాయి.. పార్టీలో కొత్తగా చేరికలు లేకపోగా.. ఉన్న కొందరు నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. ఆ మధ్య పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా ఇందిరా శోభన్ షర్మిలకు హ్యాండ్ ఇచ్చారు. దీంతో అసలు షర్మిల పార్టీ తెలంగాణలో నిలదొక్కుకుంటుందా ? అనే చర్చ జరుగుతోంది.

kcr

అసలు షర్మిల కొత్త పార్టీ ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఎంతమేరకు ఉంటుందన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.. వైఎస్ షర్మిల చరిష్మా ఏ మేరకు ఓట్లు రాల్చుతుందనే విషయంలో క్లారిటీ రాకపోతే.. నేతలెవరూ ఆమె పార్టీ వైపు చూసే అవకాశం ఉండకపోవచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాననే నినాదంతో ముందుకొచ్చిన వైఎస్ షర్మిలకు నేతల రాజీనామాలు గట్టిదెబ్బగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో పోటీ చేయకపోయినా.. అధికార టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలనుకుంటున్న వైఎస్ షర్మిల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. 

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

30 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

11 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

16 hours ago

This website uses cookies.