Health Tips | తేనె, నిమ్మకాయతో గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోకపోతే ప్రమాదమే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips | తేనె, నిమ్మకాయతో గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోకపోతే ప్రమాదమే!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 August 2025,7:00 am

Health Tips | ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ కలిపి తాగడం సాధారణంగా చూస్తున్నాం. ఈ మిశ్రమంలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని నమ్మకం. అయితే ఇది అందరికీ అనుకూలం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

#image_title

ఇవి తెలుసుకోండి..

ఈ మిశ్రమం తీసుకోవడంవల్ల ప్రయోజనాలకన్నా కొన్ని సందర్భాల్లో దుష్ప్రభావాలే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందంటున్నారు. ఆమ్లత (Acidity) ఉన్నవారికి జాగ్రత్త . వీటి మిశ్రమం కొన్ని మందికి చేదుగా అనిపించవచ్చు. ఇది కడుపులో ఆమ్లతను మరింత పెంచి, అసిడిటీ సమస్యను పెంచే అవకాశం ఉంది. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ కారణంగా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వేడి నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం వల్ల అల్సర్‌ సమస్య తీవ్రతరం కావచ్చు . నిమ్మకాయలోని ఆమ్ల పదార్థాలు అల్సర్‌ను పెంచుతాయి. తేనె వేడి నీటిలో కలిస్తే ఇది మరింత ప్రభావాన్ని చూపుతుంది. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ , మూత్రపిండాల్లో కాల్షియం ఆక్సలేట్ పెరగడానికి కారణమవుతుంది. ఇది రాళ్ల సమస్యను పెంచే అవకాశం ఉంది. అలాంటి వారు ఈ మిశ్రమాన్ని నివారించాలి. నిత్యం తేనె-నిమ్మకాయ గోరువెచ్చని నీరు తాగడం వల్ల దంతాల ఎనామెల్ బలహీనపడుతుంది. దీని వల్ల దంతక్షయం, దంత సున్నితత్వం వంటి సమస్యలు రావచ్చు.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి