
Revanth Reddy : కేసీఆర్ హయాంలో సైలెంట్.. రేవంత్ సర్కార్ హయాంలో ఎందుకీ వివక్ష..!
Revanth Reddy : అదేంటో గానీ కేసీఆర్ పదేండ్లు పరిపాలించినప్పుడు చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఏం చేసినా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఇష్టం వచ్చినట్టు పరిపాలించినా సరే ఎవరూ ధిక్కరించలేకపోయారు. అప్పట్లో కొంత మంది మీడియా అధినేతలు కొంత మంది కరుడుగట్టిన తెలంగాణ వాదులకు ఫోన్లు చేసి మరీ.. మనం సాధించిన తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అని చెప్పినా సరే వారంతా మేం ఇప్పుడు ఏం చేయలేం అంటూ ఫోన్లు పెట్టేశారంట. అలాంటి వారు కూడా ఇప్పుడు రేవంత్ సర్కార్ మీద గొంతెత్తుతున్నారు. తెలంగాణకు ఎక్కడ లేని అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు.
అయితే కేసీఆర సర్కార్ హాయంలో చాలా మంది సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు సూది పిన్ను చప్పుడైనా గగ్గోలు పెడుతున్నారు. మరి ఎందుకు ఇలా రేవంత్ సర్కార్ మీద అందరూ విరుచుకుపడుతున్నారనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం విరాజిల్లిన చోటనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అణచివేత కొనసాగిన సమయంలో గొంతులు నోరు మెదపవు. కానీ ఎక్కడైతే విమర్శలకు అవకాశం ఉంటుందో అక్కడనే మూగబోయిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది.
Revanth Reddy : కేసీఆర్ హయాంలో సైలెంట్.. రేవంత్ సర్కార్ హయాంలో ఎందుకీ వివక్ష..!
రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి భిన్నంగా పాలన సాగిస్తున్నారు. అంతకు ముందు లాగా కాకుండా ముఖ్యమంత్రి అయిన వెంటనే అందరినీ కలుపుకుని పోయారు. ప్రతిపక్ష నేతలను కూడా కలిసి కొత్త సాంప్రదాయానికి తెర తీశారు. ఎవరు విమర్శలు చేసినా సరే అందరికీ మౌనంగా సమాధానాలు ఇచ్చారు. మీడియా ముందుకు వచ్చి అందరు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నారు. తెలంగాణ కోసం తానుచేయబోయే అన్ని పనులను వివరిస్తున్నారు. ఎవరు విమర్శలు చేసినా సరే వాటిని స్వీకరిస్తున్నారు. అందుకే ఇప్పుడు రేవంత్ సర్కార్ విషయంలో ఇలాంటి విమర్శలు పెరిగాయని అంటున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు. ఇంకా కుదురుకోనే లేదు అప్పుడే ఆయన సర్కార్ మీద తీవ్రమైన విమర్శలు రావడం ఏంటని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…
Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…
This website uses cookies.