Revanth Reddy : అదేంటో గానీ కేసీఆర్ పదేండ్లు పరిపాలించినప్పుడు చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఏం చేసినా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఇష్టం వచ్చినట్టు పరిపాలించినా సరే ఎవరూ ధిక్కరించలేకపోయారు. అప్పట్లో కొంత మంది మీడియా అధినేతలు కొంత మంది కరుడుగట్టిన తెలంగాణ వాదులకు ఫోన్లు చేసి మరీ.. మనం సాధించిన తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అని చెప్పినా సరే వారంతా మేం ఇప్పుడు ఏం చేయలేం అంటూ ఫోన్లు పెట్టేశారంట. అలాంటి వారు కూడా ఇప్పుడు రేవంత్ సర్కార్ మీద గొంతెత్తుతున్నారు. తెలంగాణకు ఎక్కడ లేని అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు.
అయితే కేసీఆర సర్కార్ హాయంలో చాలా మంది సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు సూది పిన్ను చప్పుడైనా గగ్గోలు పెడుతున్నారు. మరి ఎందుకు ఇలా రేవంత్ సర్కార్ మీద అందరూ విరుచుకుపడుతున్నారనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం విరాజిల్లిన చోటనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అణచివేత కొనసాగిన సమయంలో గొంతులు నోరు మెదపవు. కానీ ఎక్కడైతే విమర్శలకు అవకాశం ఉంటుందో అక్కడనే మూగబోయిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది.
రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి భిన్నంగా పాలన సాగిస్తున్నారు. అంతకు ముందు లాగా కాకుండా ముఖ్యమంత్రి అయిన వెంటనే అందరినీ కలుపుకుని పోయారు. ప్రతిపక్ష నేతలను కూడా కలిసి కొత్త సాంప్రదాయానికి తెర తీశారు. ఎవరు విమర్శలు చేసినా సరే అందరికీ మౌనంగా సమాధానాలు ఇచ్చారు. మీడియా ముందుకు వచ్చి అందరు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నారు. తెలంగాణ కోసం తానుచేయబోయే అన్ని పనులను వివరిస్తున్నారు. ఎవరు విమర్శలు చేసినా సరే వాటిని స్వీకరిస్తున్నారు. అందుకే ఇప్పుడు రేవంత్ సర్కార్ విషయంలో ఇలాంటి విమర్శలు పెరిగాయని అంటున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు. ఇంకా కుదురుకోనే లేదు అప్పుడే ఆయన సర్కార్ మీద తీవ్రమైన విమర్శలు రావడం ఏంటని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.
Diwali : దీపావళి పండగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకు దీపావళి పండుగ…
Teeth : ప్రతి ఒక్కరికి కూడా తెల్లని మరియు శుభ్రమైన దంతాలు అనేవి చాలా మంచిది. కానీ ఎన్నోసార్లు మన…
Zodiac Signs : అట్లతద్ది ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగను పెళ్లి కాని వారు మంచి భర్త…
Konda Surekha : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గం చెందిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్…
Farmers : మన దేశంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా…
Ap Govt New Pensions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లబ్ధి…
HYDRA : GHMC పరిధిలోని పబ్లిక్ ఆస్తులు మరియు విపత్తు నిర్వహణను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైడ్రా (హైదరాబాద్…
vijayasai reddy : ఏపీలో వైసీపీ దారుణమైన ఓటమి చవి చూశాక జగన్ సరికొత్త ఎత్తులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.…
This website uses cookies.