ప్రస్తుతం ఏపీలో ఒకే ఒక్క హాట్ టాపిక్. అదే తిరుపతి ఉపఎన్నిక. తిరుపతి ఉప ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ అప్పుడే రంగంలోకి దిగాయి. నువ్వా.. నేనా.. అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఎలాగూ పక్కాగా గెలిచి తీరాలని పట్టుబడుతోంది. అలాగే.. టీడీపీ కూడా ఈసారి బాగానే ఆశలు పెట్టుకుంది. కనీసం తిరుపతి ఉపఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇక.. బీజేపీ, జనసేన మధ్య ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నిక విషయంలో పెద్ద గొడవే జరుగుతోంది.
ఎందుకంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోసం జనసేన పోటీ చేయకుండా త్యాగం చేసింది. జనసేన తిరుపతి ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని అక్కడ పోటీ చేయకుండా.. ఇక్కడ సీటు కావాలని బీజేపీకి కబురు పంపింది. కానీ.. బీజేపీ మాత్రం.. దూకుడు మీద ఉండి.. లేదు లేదు.. తిరుపతిలోనూ బీజేపీ పోటీ చేస్తుందంటూ హింట్ ఇచ్చింది. దీంతో జనసేన, బీజేపీ మధ్య మాటల వార్ ప్రారంభం అయింది. వార్నీ.. వీళ్లు కలిసి సంవత్సరం కూడా కాలేదు.. అప్పుడే రెండు పార్టీలు నడిరోడ్డు మీద కొట్టుకుంటున్నాయిగా.. అంటూ ప్రజలు అనుకున్నారు.
ఏది ఏమైనా.. ఈసారి తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేసి తీరుతాం అని జనసేన కూడా భీష్మించుకు కూర్చున్నది. ఈనేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. జనసేన దెబ్బకు ఆయన కూడా తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో వెనక్కి తగ్గినట్టుగా స్పష్టమవుతోంది.
బీజేపీ అంటేనే ఏపీలోని ఇతర పార్టీలు వణుకుతున్నా… జనసేన మాత్రం బెదరడం లేదు. సై అంటే సై అంటోంది. దీంతో సోము వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల శోభాయాత్ర సమయంలో బీజేపీ తిరుపతి ఉపఎన్నిక బరిలో ఉంటుందని చెప్పినా… ప్రస్తుతం మాత్రం ఆమాట మాట్లాడటం లేదు. తిరుపతి వెంకన్న సాక్షిగా.. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్న సోము.. ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు.. అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
అయితే.. ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న సోము… తిరుపతి ఉపఎన్నికపై ఇంకా జనసేన పార్టీతో చర్చిస్తున్నామని.. ఇంతవరకు అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదని దాటవేశారు. బీజేపీ, జనసేన.. ఈ రెండు పార్టీలో ఒక పార్టీ అభ్యర్థి మాత్రమే పోటీ చేస్తారంటూ ఆయన చెప్పడం వెనుక జనసేనకు బీజేపీ భయపడింది.. అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
ఇన్ డైరెక్ట్ గా ఈసారి తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ కాకుండా.. జనసేన అభ్యర్థి పోటీలో ఉండబోతున్నట్టుగా సోము సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. ఒకవేళ జనసేన బరిలో దిగితే అధికార పార్టీ వైసీపీ, టీడీపీని దాటుకొని గెలుస్తుందా? జనసేన దమ్మును చూపిస్తుందా?
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.