తహశీల్దారే అంబులెన్స్ డ్రైవర్.. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో.. మానవత్వంతో డ్రైవర్ గా మారిన తహశీల్దార్

Advertisement
Advertisement

ప్రస్తుతం మహమ్మారి ఎంతలా దేశాన్ని అతలాకుతలం చేస్తోందో అందరికీ తెలుసు. మహమ్మారి వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర యాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. దీంతో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. బయటికి వెళ్తే ఎక్కడ ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతుందోనని భయపడుతున్నారు జనాలు. ఏపీలోనూ మధ్యాహ్నం 12 నుంచి తెల్లారి ఉదయం 6 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటోంది. నిత్యావసర సరుకుల కోసం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రం షాపులు తెరిచి ఉంటాయి. మిగితా సమయాల్లో కర్ఫ్యూను విధించారు.

Advertisement

ఇదిలా ఉండగా… శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ తహశీల్దార్ ఏకంగా అంబులెన్స్ డ్రైవర్ గా మారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లాలోని సోంపేటకు చెందిన ఓ వ్యక్తికి ఊపిరి అందడం లేదు. ఆయనకు కరోనా రావడంతో గత కొన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. అయితే.. సడెన్ గా ఆయనకు ఊపిరి అందకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. కానీ.. ఏ అంబులెన్స్ రాలేదు. దీంతో సోంపేట తహశీల్దార్ కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న తహశీల్దార్.. అంబులెన్స్ ఏదీ లేకపోవడంతో.. ఉద్దానం ఫౌండేషన్ వాళ్ల అంబులెన్స్ ను రావాలని కోరారు. కానీ.. ఉద్దానం ఫౌండేషన్ అంబులెన్స్ డ్రైవర్ కరోనా వచ్చిన పేషెంట్ ను తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో.. తనే అంబులెన్స్ డ్రైవర్ గా మారి.. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

tahsildar

ప్రాణాలకు తెగించిన తహశీల్దార్ ను మెచ్చుకున్న స్థానికులు

తన ప్రాణాలకు తెగించి.. అంబులెన్స్ డ్రైవర్ గా మారి.. కరోనా సోకిన వ్యక్తిని సరైన సమయానికి ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటిన తహశీల్దార్ గురుప్రసాద్ ను అక్కడి స్థానికులు తెగ మెచ్చుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలు మిగిలితే చాలు అని అనుకుంటున్న ఈ రోజుల్లో ఓ బాధితుడిని ఆసుపత్రికి తరలించిన తహశీల్దార్ నిజంగా గ్రేట్. అలాగే.. తహశీల్దార్ కు అక్కడి స్థానిక వాలంటీర్ శ్రీకాంత్ కూడా బాధితుడిని ఆసుపత్రికి తరలించేందుకు సహకరించాడు. మొత్తం మీద..  అక్కడి స్థానికులతో పాటు అధికారులు కూడా తహశీల్దార్ తో పాటు వాలంటీర్ శ్రీకాంత్ ను పొగడ్తల్లో ముంచెత్తారు.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

29 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.