TDP Chief Chandrababu Facing Jai NTR Heat.!
Chandrababu : రాజకీయం, సినిమా వేర్వేరు కాదంటారు కొందరు. సరే, దానికీ దీనికీ సంబంధం ఏంటన్నది వేరే చర్చ. తెలుగునాట రాజకీయాలకీ, సినిమాకీ విడదీయరాని బంధం వుంది. పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో వున్నారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు నాట కొత్త రాజకీయ పార్టీని స్థాపించి, దేశ రాజకీయాలపైనా తనదైన ముద్ర వేశారు. తెలుగు నాట పార్టీ పెడుతూనే రికార్డు సమయంలో అధికారంలోకి వచ్చారు స్వర్గీయ ఎన్టీయార్. ఆ రికార్డుని ఇంకెవరూ ఇప్పట్లో బ్రేక్ చేయలేరు కూడా. ఆ పార్టీ పేరు తెలుగుదేశం. అదిప్పుడు తెలంగాణ నేలపై దాదాపు కనుమరుగైపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొసప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. మరి, ఆ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చే శక్తి ఎవరికి వుంది.?
ఇంకెవరికి, ఆ స్వర్గీయ ఎన్టీయార్ మనవడైన యంగ్ టైగర్ ఎన్టీయార్కేనంటున్నారు అభిమానులు. ఆ సెగని, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చాలా గట్టిగానే ఎదుర్కొంటున్నారు. తాజాగా, చంద్రబాబుకి ‘జై ఎన్టీఆర్’ సెగ తగిలింది. నిజానికి, గత కొంతకాలంగా ఆయన ఈ సెగని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడది మరింత ఎక్కువైందంతే.
గతంలో యంగ్ టైగర్ ఎన్టీయార్తో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకున్న చంద్రబాబు, ఆ తర్వాత తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం అతన్ని పార్టీకి చాలా దూరంగా పంపేశారు. అప్పటినుంచి, రాజకీయాల వైపు అస్సలు ఆసక్తి చూపడంలేదు జూనియర్ ఎన్టీయార్.
TDP Chief Chandrababu Facing Jai NTR Heat.!
అయితే, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఊరుకోవడంలేదు. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఎన్టీఆర్కి ప్రాధాన్యతనివ్వాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘జై ఎన్టీఆర్’ నినాదాలతోపాటు, ప్రత్యేకంగా రూపొందించిన జెండాలతోనూ చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా చేస్తున్నారు. కానీ, స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగనిదే, చంద్రబాబు మెట్టు దిగే పరిస్థితి వుండదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి ఎన్టీఆర్ ఇమేజ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందిగానీ, అలా చేస్తే నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోతుందని చంద్రబాబుకి బాగా తెలుసు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.