Ys Jagan : ఉభయగోదావరి జిల్లాల రైతుల ధాన్యం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఎం వైఎస్ జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాసారు. రెండు జిల్లాలకు చెందిన పదిమంది టీడీపీ యంయల్ ఏలు, ఎమ్మెల్సీలు లేఖ రాసారు. ఏలూరులో లేఖ విడుదల చేసిన ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు , మంతెన రామరాజు… ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు.
నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ధాన్యం అమ్మి 3, 4 నెలలు గడుస్తున్నా నేటికి రైతులకు సొమ్ము చెల్లించకపోవడం అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే, గత పంట పెట్టుబడికి వడ్డీ ఎవరు కడతారు? రెండో పంట దాళ్వాకు పెట్టుబడి ఎలా తేవాలి? అని నిలదీశారు.
ధాన్యం కొనుగోలు వివరాలను పారదర్శకంగా చూపించవలసిన ప్రభుత్వం ఆన్ లైన్ నుండి ఎందుకు వాటిని తొలగించింది? అని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల రైతులు 27 మంది వైసీపీ ఎమ్మెల్యేలను, అయిదుగురు ఎంపీలను గెలిపించినందుకు శిక్ష విధిస్తారా అని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల పట్ల, రైతాంగం పట్ల నిర్లక్ష్యం, కక్షను ముఖ్యమంత్రి విడనాడాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.