
telangana cabinet meeting Updates
Telangana : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ని మరో 10 రోజులు పొడిగిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ఆంక్షలను సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ఈ మీటింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మంగళవారం సుదీర్ఘంగా కొనసాగింది. దాదాపు ఆరు గంటలకు పైగా నడిచింది. దీంతో ఆ భేటీ ఎప్పుడెప్పుడు ముగుస్తుందా, అప్డేట్స్ ఏమేముంటాయా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రెండు అంశాలపై చర్చించే అవకాశం ఉందని ముందు నుంచీ చెబుతున్నారు.
అందులో ఒకటి.. లాక్ డౌన్. రెండు.. పీఆర్సీ అమలు. కరోనా పాజిటివ్ కేసులు బాగా తగ్గటంతో జనసంచారానికి సంబంధించిన సడలింపును పొడిగించే ఛాన్స్ ఉందని రెండు మూడు రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తుండగా దాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు పెంచనున్నారని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన వేతనాలను ఎప్పటి నుంచి ఇవ్వనున్నారనే దానిపైనా నిర్ణయం తీసుకుంటారని భావించారు. వీటికి తోడు వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించే డయాగ్నాస్టిక్ కేంద్రాల ప్రారంభ తేదీనీ ఖరారు చేయనున్నారని అన్నారు.
telangana cabinet meeting Updates
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్లను తామే ఉచితంగా వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో టీకాల పంపిణీపైనా సమీక్ష నిర్వహించనున్నారని ఆశించారు. మంచి నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపే సూచనలు ఉన్నాయని తెలిపారు. లాక్డౌన్ వల్ల రాష్ట్ర సర్కారు ఆదాయం భారీగా పడిపోవటంతో ఆ లోటు భర్తీకి ప్రభుత్వ భూములను విక్రయించాలని గవర్నమెంట్ అనుకుంది. దీనికీ కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు పేర్కొన్నారు. రైతుబంధు సాయం, ఖరీఫ్ సాగు దిశగా చేపట్టాల్సిన చర్యలు, ఇతరత్రా అంశాలపై లోతుగా చర్చించనున్నట్లు అంచనా వేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండు గురువారం నుంచి లాక్ డౌన్ సడలింపులను సాయంత్రం 5 గంటల వరకు పొడిగించనుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి వరకే జనసంచారానికి అనుమతిస్తారు. అక్కడ కొవిడ్ వ్యాప్తి కంట్రోల్ కాకపోవటంతో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు నల్గొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ప్రస్తుతం పాటిస్తున్న లాక్ డౌన్ రూల్స్ నే మరో 10 రోజుల పాటు కంటిన్యూ చేయనున్నారు.
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
This website uses cookies.