Telangana Dalit Bandhu : తెలంగాణ దళిత బంధు ద్వారా ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షల సాయం.. ఎలా ఎంపిక చేస్తారంటే?

Advertisement
Advertisement

Telangana Dalit Bandhu : తెలంగాణ దళిత బంధు.. కేవలం తెలంగాణ దళితుల కోసం రూపొందిన సరికొత్త పథకం ఇది. ఈ పథకాన్ని తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఈసందర్భంగా తెలంగాణ దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణలో దళిత సాధికారత కోసం ఒక పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకు హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ పథకానికి తెలంగాణ దళిత బంధు అనే పేరు పెట్టారు.

Advertisement

telangana dalit bandhu from Huzurabad by cm kcr

ఇప్పటికే రైతు బంధు అనే పథకం.. రైతుల కోసం రూపొందించిన విషయం తెలిసిందే. రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి ఒక ఎకరానికి పది వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తోంది. అలాగే.. తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా కూడా తెలంగాణలోని దళితులను ఎంపిక చేసి వాళ్లకు ప్రభుత్వం సాయం అందిస్తుంది.

Advertisement

అయితే.. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద.. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో 1200 కోట్లతో ప్రారంభించనున్నారు. ఇది పైలెట్ ప్రాజెక్టు కాబట్టి.. హుజూరాబాద్ నియోజకవర్గానికి సుమారుగా 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చించనుంది.

Telangana Dalit Bandhu : లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు?

ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 20929 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అసలైన లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. పేద కుటుంబాలను, కుటుంబంలో ఉద్యోగం చేసే వాళ్లు లేకుంటే.. కూలి పని చేసుకొని బతికే వాళ్లను,.. ఇలా.. పలు నిబంధనల ప్రకారం.. అర్హులైన వారిని ప్రభుత్వం ఎంపిక చేసి.. ఆయా కుటుంబాలకు ప్రతీ కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున అందిస్తారు.

Telangana Dalit Bandhu : రైతు బంధు లాగానే.. దళిత బంధు సాయం డైరెక్ట్ గా ఖాతాల్లో జమ

ముందు హుజూరాబాద్ లో ప్రారంభించాక.. తెలంగాణ దళిత బంధు పథకాన్ని మొత్తం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు. రైతు బంధు సాయాన్ని డైరెక్ట్ గా రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగానే.. దళిత బంధు సాయాన్ని కూడా డైరెక్ట్ గా ఎంపికైన దళితుల ఖాతాల్లోనే జమ చేయనుంది ప్రభుత్వం. ఈ పథకాన్ని జులై చివరి వారంలో కానీ.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున కానీ.. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ లో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

38 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

10 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

11 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

12 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

13 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

14 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

15 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

16 hours ago

This website uses cookies.