
china people
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉన్నా విషయం అందరికి తెలిసిందే, ఆ తర్వాత స్థానంలో మన దేశం ఉంది. గత కొన్ని దశాబ్దాల నుండి చైనా జనాభా విషయంలో మొదటి స్థానంలో ఉండటంతో అక్కడి పాలకులు ఆలోచనలో పడ్డారు. మరి కొన్ని సంవత్సరాలు ఇదే విధంగా ఉంటే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఆ దేశ ప్రభుత్వం భావించింది.
దీనితో జనాభా పెరుగుదలను అరికట్టటానికి రంగంలోకి దిగినా చైనా ప్రభుత్వం పెళ్లైన ఒక్కో జంటకు ఒక్క సంతానం మాత్రమే ఉండాలని 1970 లో నిబంధన విధించింది. అయితే ఈ నిబంధన వలన దేశ జనాభా వృద్ధి రేటు తగ్గిన కానీ, మరో సమస్యా వచ్చింది. లింగ బేధం చాలా స్థాయిలో పెరిగింది. ఫలితంగా మహిళల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. పైగా జనాభా తగ్గువ ఉండటం, మెరుగైన వైద్య సేవలు ఉండటంతో మనిషి సగటు జీవన వయస్సు పెరగటంతో వృద్ధుల సంఖ్య కూడా పెరిగింది. దీని వలన యువ శ్రామిక శక్తి చైనాలో తగ్గు ముఖం పట్టింది.
దేశం అభివృద్ధి చెందాలంటే కార్మిక శక్తి అనేది చాలా అవసరం, ఈ కోణంలో చూస్తే చైనా ఆ విషయంలో వెనకబడి ఉండటంతో 1970 లో ప్రవేశపెట్టిన ఒక జంటకు ఒక్క సంతానం అనే నిబంధనను సవరించి, ఇద్దరు సంతానం ఉండవచ్చు అంటూ 2016 లో సవరణ చేసింది, కానీ దాని వలన ఎలాంటి ఫలితం ఉండటం లేదు. మారిన జీవన విధానం కావచ్చు. యువ భార్యాభర్తల మధ్య ఉంటున్న అవగాహనా కావచ్చు, పెరిగిన కుటుంబ ఖర్చులు కావచ్చు, జంటలు ఒక్క సంతానానికే మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్న చైనా మహిళలు పిల్లలను కనటానికి పెద్దగా ఆసక్తి చూపించటం లేదని అక్కడి సర్వేలు చెపుతున్నాయి.
అక్కడ ఏడాదికి ఏడాదికి శిశువుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కరోనా వలన తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు వలన ఆ సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. 2025 నాటికీ చైనా లో పదవి విరమణ చేసిన వాళ్ళ సంఖ్య దాదాపుగా 30 కోట్లు వరకు ఉంటుంది. ఈ కోణంలో చూస్తే యువతరం సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. ప్రతి దేశంలో కూడా మానవ వనరులే సహజ సిద్దమైన ఆస్తులుగా చూస్తారు.. ఆ విషయంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచానికి ఈ విషయంలో భారతదేశం ఆదర్శంగా ఉంది. ఇక చైనా లో ఈ ఏడాది చివరిలో జనాభా లెక్కలు మొదలుకాబోతున్నాయి. ప్రతి పదేళ్లకు ఒక్కసారి అక్కడ జనాభా లెక్కలు జరుగుతాయి. అవి పూర్తి అయితే కానీ అన్ని విషయాలు తెలియవు.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.