BRS : బిఆర్ఎస్ కు పట్టుకున్న భయం…లోక్ సభ స్థానాలు కష్టమే…!!

Advertisement
Advertisement

BRS : తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన టిఆర్ఎస్ కు ఇప్పుడు కొత్త భయాలు పట్టుకున్నాయి. లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ పరిస్థితి అగమ్యత గోచక తయారైంది. పోటీ చేసేందుకు నేతలు వెనకాడుతున్నారని చర్చ మొదలైంది. ఎమ్మెల్యే టికెట్ రానివారు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారూ అనుకుంటే వాళ్లు కూడా వద్దంటున్నారు అని సమాచారం. సిట్టింగులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదంటా. ఇది వరకు గులాబీ పార్టీ కి డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించుకునేందుకు నాయకులు పోటీ పడేవారు. కాని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అని చెప్పాలి. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలలో లోక్ సభ స్థానాలకు కారు గుర్తుపై పోటీ చేసేందుకు నేతలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. కొన్ని నియోజకవర్గాలలో అది స్పష్టంగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి ప్రభుత్వాన్ని కోల్పోవడంతో మళ్లీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు అంటే గెలుపు కష్టమని భావన గులాబి నేతలలో ఏర్పడింది. దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ బిజెపి పార్టీల మధ్యనే ప్రధానంగా ఉండే అవకాశం ఉంటుందని బిఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు ఎన్నికలలో పోటీ చేసి డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుందా అని అనుమానం వారిని వెంటాడుతున్నాయి. మెజార్టీ నియోజకవర్గాలలో పోటీకి భయపడుతున్నారు.

Advertisement

ఒకటి రెండు చోట్లకు మాత్రమే అంత డిమాండ్ ఉంది. నేతలను ఉత్తేజపరిచేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. నేతలను పోరాట మార్గంలో నడిపించాలనుకుంటున్నారు. ఎన్నికలలో ఖర్చుపెట్టిన గెలుస్తామో లేదో అని ఆందోళన నేతలలో కనిపిస్తుంది. క్యాడర్ లో నేతల లో అసంతృప్తి తగ్గలేదు. ఇక ఇప్పుడు టికెట్ తెచ్చుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే గెలుస్తామో లేదా అని నేతలు భయపడుతున్నారు. అయితే పార్టీ పెద్దలు చెబుతున్న దాని ప్రకారమే 5 నుండి 6 పార్లమెంట్ నియోజకవర్గాలలో మాత్రమే అసెంబ్లీ లో బిఆర్ఎస్ కు అనుకున్న ఫలితాలు వచ్చాయి. అంటే పది స్థానాల్లో పార్టీకి ప్రతికూల స్పందన ఉంది. ఖమ్మం , నల్గొండ ,భువనగిరి , పెద్ద పల్లి ,ఆదిలాబాద్ , నాగర్ కర్నూల్ , మహబూబ్నగర్ , వరంగల్ , మహబూబాద్ , లోక్ సభ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సుమారు రెండు నుంచి మూడు లక్షల పైగా ఓట్ల మెజార్టీ సాధించింది. సికింద్రాబాద్ , మల్కాజ్గిరి , కరీంనగర్ మెదక్ , జహీరాబాద్ వంటి చోట్ల బిఆర్ఎస్ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. అక్కడ కూడా లోక్ సభ ఎన్నికలలో గెలిచే అవకాశం పై అనుమానాలు కొనసాగుతున్నాయి. దాంతో పోటీకి బిఆర్ఎస్ నేతలు విముక్తత వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకోవడమే అన్న భయం వారిలో కనిపిస్తుంది.

Advertisement

దాంతో సిట్టింగులను ఉద్దేశపరిచే కార్యక్రమంలో శుక్రవారం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. లోక్ సభ సమావేశాల్లో పార్టీ వైఖరిని నియమించేందుకు అని చెప్పుకొచ్చిన అసలు సంగతి పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం చేసే అందుకే అని చెప్పక తప్పదు. కేసీఆర్ స్వయంగా మాట్లాడితే నేతలు ధైర్యంగా ఉంటారని కెసిఆర్ అంచనా వేసుకుని వారిని పిలిపించారు. భవిష్యత్తులో ఇలా అనేక మీటింగ్ లు పెట్టి వారి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తారని అనిపిస్తుంది. బిఆర్ఎస్ లోక్ సభ టికెట్ అంటే వద్దు అనే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది . ఒకప్పుడు టికెట్ వస్తే చాలు గెలుస్తామనుకునేవారు కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. పైగా అధికారంలో ఉన్నప్పుడు కనీసం క్యార్డర్ ని గుర్తించలేదని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెద్దల ఏక లక్ష వైకల్యం మారాలని కుండబద్దలు కొడుతున్నారు. సమీక్షలు కనీసం తమకు టికెట్ ఇవ్వాలని కానీ లేదా ఫలానా నేతకు ఇవ్వాలని కానీ ఎవ్వరు కోరడం లేదంట. దీంతో పార్టీలో పోటీ చేసేందుకు నేతలలో ఆసక్తి తగ్గిందని పోటీ అంటేనే పార్టీ నేతలు వెనకంచ వేస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ పరిస్థితి నుంచి బయట పడాలి అంటే కేసీఆర్ ఇంకా యాక్టివ్ గా రంగంలోకి దిగాలని చెబుతున్నారు విశ్లేషకులు. మరి కేసీఆర్ ఏం చేస్తారో వేచి చూడాలి.

Advertisement

Recent Posts

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…

33 mins ago

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

10 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

11 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

12 hours ago

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు…

12 hours ago

New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్క‌ర్ పాల‌సీ విధి విధానాలు ఇవే..!

New Liquor Policy : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక స‌మూలమైన మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొత్త‌గా మ‌ద్యం…

13 hours ago

Chandrababu : జ‌గ‌న్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జ‌గ‌న్ ముఖాన క‌ట్టి రాష్ట్ర‌మంతా తిప్పుతానన్న చంద్ర‌బాబు..!

Chandrababu : గ‌త కొన్ని రోజులుగా ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. త‌న హ‌యాంలో…

16 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్…

17 hours ago

This website uses cookies.