
#image_title
BRS : తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన టిఆర్ఎస్ కు ఇప్పుడు కొత్త భయాలు పట్టుకున్నాయి. లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ పరిస్థితి అగమ్యత గోచక తయారైంది. పోటీ చేసేందుకు నేతలు వెనకాడుతున్నారని చర్చ మొదలైంది. ఎమ్మెల్యే టికెట్ రానివారు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారూ అనుకుంటే వాళ్లు కూడా వద్దంటున్నారు అని సమాచారం. సిట్టింగులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదంటా. ఇది వరకు గులాబీ పార్టీ కి డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించుకునేందుకు నాయకులు పోటీ పడేవారు. కాని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అని చెప్పాలి. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలలో లోక్ సభ స్థానాలకు కారు గుర్తుపై పోటీ చేసేందుకు నేతలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. కొన్ని నియోజకవర్గాలలో అది స్పష్టంగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి ప్రభుత్వాన్ని కోల్పోవడంతో మళ్లీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు అంటే గెలుపు కష్టమని భావన గులాబి నేతలలో ఏర్పడింది. దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ బిజెపి పార్టీల మధ్యనే ప్రధానంగా ఉండే అవకాశం ఉంటుందని బిఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు ఎన్నికలలో పోటీ చేసి డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుందా అని అనుమానం వారిని వెంటాడుతున్నాయి. మెజార్టీ నియోజకవర్గాలలో పోటీకి భయపడుతున్నారు.
ఒకటి రెండు చోట్లకు మాత్రమే అంత డిమాండ్ ఉంది. నేతలను ఉత్తేజపరిచేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. నేతలను పోరాట మార్గంలో నడిపించాలనుకుంటున్నారు. ఎన్నికలలో ఖర్చుపెట్టిన గెలుస్తామో లేదో అని ఆందోళన నేతలలో కనిపిస్తుంది. క్యాడర్ లో నేతల లో అసంతృప్తి తగ్గలేదు. ఇక ఇప్పుడు టికెట్ తెచ్చుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే గెలుస్తామో లేదా అని నేతలు భయపడుతున్నారు. అయితే పార్టీ పెద్దలు చెబుతున్న దాని ప్రకారమే 5 నుండి 6 పార్లమెంట్ నియోజకవర్గాలలో మాత్రమే అసెంబ్లీ లో బిఆర్ఎస్ కు అనుకున్న ఫలితాలు వచ్చాయి. అంటే పది స్థానాల్లో పార్టీకి ప్రతికూల స్పందన ఉంది. ఖమ్మం , నల్గొండ ,భువనగిరి , పెద్ద పల్లి ,ఆదిలాబాద్ , నాగర్ కర్నూల్ , మహబూబ్నగర్ , వరంగల్ , మహబూబాద్ , లోక్ సభ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సుమారు రెండు నుంచి మూడు లక్షల పైగా ఓట్ల మెజార్టీ సాధించింది. సికింద్రాబాద్ , మల్కాజ్గిరి , కరీంనగర్ మెదక్ , జహీరాబాద్ వంటి చోట్ల బిఆర్ఎస్ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. అక్కడ కూడా లోక్ సభ ఎన్నికలలో గెలిచే అవకాశం పై అనుమానాలు కొనసాగుతున్నాయి. దాంతో పోటీకి బిఆర్ఎస్ నేతలు విముక్తత వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకోవడమే అన్న భయం వారిలో కనిపిస్తుంది.
దాంతో సిట్టింగులను ఉద్దేశపరిచే కార్యక్రమంలో శుక్రవారం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. లోక్ సభ సమావేశాల్లో పార్టీ వైఖరిని నియమించేందుకు అని చెప్పుకొచ్చిన అసలు సంగతి పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం చేసే అందుకే అని చెప్పక తప్పదు. కేసీఆర్ స్వయంగా మాట్లాడితే నేతలు ధైర్యంగా ఉంటారని కెసిఆర్ అంచనా వేసుకుని వారిని పిలిపించారు. భవిష్యత్తులో ఇలా అనేక మీటింగ్ లు పెట్టి వారి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తారని అనిపిస్తుంది. బిఆర్ఎస్ లోక్ సభ టికెట్ అంటే వద్దు అనే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది . ఒకప్పుడు టికెట్ వస్తే చాలు గెలుస్తామనుకునేవారు కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. పైగా అధికారంలో ఉన్నప్పుడు కనీసం క్యార్డర్ ని గుర్తించలేదని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెద్దల ఏక లక్ష వైకల్యం మారాలని కుండబద్దలు కొడుతున్నారు. సమీక్షలు కనీసం తమకు టికెట్ ఇవ్వాలని కానీ లేదా ఫలానా నేతకు ఇవ్వాలని కానీ ఎవ్వరు కోరడం లేదంట. దీంతో పార్టీలో పోటీ చేసేందుకు నేతలలో ఆసక్తి తగ్గిందని పోటీ అంటేనే పార్టీ నేతలు వెనకంచ వేస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ పరిస్థితి నుంచి బయట పడాలి అంటే కేసీఆర్ ఇంకా యాక్టివ్ గా రంగంలోకి దిగాలని చెబుతున్నారు విశ్లేషకులు. మరి కేసీఆర్ ఏం చేస్తారో వేచి చూడాలి.
Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…
YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…
Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…
Anganwadi : తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఇప్పుడు అత్యంత రసవత్తర దశలోకి అడుగుపెట్టింది.…
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
This website uses cookies.