Viral news : ప్రస్తుత యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎవర్ని చూసినా కానీ ఫోన్ ఆపరేట్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటారు. కొందరైతే ఏకంగా ఫోన్ చూస్తేనే వాహనాలు నడుపుతుంటారు. ఫోన్ వాడుతూ వాహనాలు నడపడం వలన ప్రమాదాలు సంభవిస్తాయని అలా చేయడం నేరమని ఎంత మంది చెప్పినా కానీ కొందరు మారడం లేదు. ఇలా ఫోన్ వాడుతూ వాహనాలను నడిపి చివరకు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.వారు గాయాలపాలయి ఆస్పత్రి బెడ్ మీద ఉన్నపుడు కూడా ఫోన్ తెరనే చూస్తూ గడుపుతున్నారు.
అంటే వారు ఫోన్ కు ఏవిధంగా బానిసలయ్యారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలా అధికంగా ఫోన్ ను వాడడం వలన అనేక ప్రమాదాలు వస్తాయని ఓ పక్క నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కానీ కొంత మంది నిపుణుల మాటలను కూడా పెడచెవిన పెడుతున్నారు. ఎంత మంది చెప్పినా కానీ ఫోన్ ను విపరీతంగా వాడుతున్నారు.ఇలాగే రాజస్థాన్ కు చెందిన అక్రమ్ అనే యువకుడు గంటల కొద్దీ ఫోన్ వాడి చివరకు ఆస్పత్రి పాలయ్యాడు. అక్రమ్ రాత్రిళ్లు మొదలుకుంటే తెల్లవారే వరకు ఫోన్ లో గడిపేవాడట.
ఇలా ఫోన్ వాడుతూ సరిగ్గా నిద్ర పోవడం అటుంచితే ఆహారం కూడా తీసుకునేవాడు కాదట. ఇప్పుడు అక్రమ్ తన కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టలేని స్థితికి వచ్చాడు. ఫోన్ విపరీతంగా వాడడం వలన మానసిక స్థితి దెబ్బతిందని డాక్టర్లు చెబుతున్నారు. మీరు కూడా ఫోన్ ఎక్కువగా వాడితే వెంటనే తగ్గించండి. లేకపోతే మిమ్మల్ని కూడా మరో అక్రమ్ లా చూడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కావున ఫోన్ వాడడం తగ్గించండి. అదే మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా మంచిది.
RRB NTPC Recruitment : RRB రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ (NTPC) కేటగిరీల మొత్తం 11,558 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ను…
Zodiac Signs : సెప్టెంబర్ నెల 24, 25వ తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే అదే రోజు…
Bay Leaf Water : ప్రస్తుత కాలంలో బిర్యానీ నుండి నాన్ వెజ్ వంటకాల వరకు బే ఆకులను ప్రతి…
Pitru Paksha : హిందూ సనాతన ధర్మంలో ఏడాదిలోని ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వికులకు అంకితం చేయబడింది. ఈ కాలాన్ని…
Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ…
Anjeer Juice : అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం అంజీర్…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
This website uses cookies.