Three Capitals : త్రీ క్యాపిటల్స్.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఎజెండా కాబోతోందా.?

Advertisement
Advertisement

Three Capitals : 2024 ఎన్నికల వరకూ వేచి చూస్తారా.? అంతకన్నా ముందే, ముందస్తు ఎన్నికలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారా.? వెళితే, మూడు రాజధానుల సంగతేమవుతుంది.? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులకు కట్టుబడి వున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, సమగ్రమైన బిల్లుని మరోసారి ప్రవేశపెడ్తామని వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రోజులు గడుస్తున్నా మూడు రాజధానుల విషయమై వైసీపీ సర్కారు ముందడుగు వేయడంలేదన్న విమర్శలున్నాయి.

Advertisement

వాస్తవానికి మూడు రాజధానులనేది కాస్త సున్నితమైన అంశం. అమరావతి కోసం భూములిచ్చిన రైతులతో పెను ఇబ్బంది ఎదురవుతోంది వైసీపీ ప్రభుత్వానికి మూడు రాజధానుల విషయంలో. ఆ రైతుల వెనుక విపక్షాల రాజకీయం సుస్పష్టం. అందుకే, వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానులపై ప్రజా తీర్పు కోరాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘మా విధానం మూడు రాజధానులు.. ఖచ్చితంగా రాష్ట్రానికి మూడు రాజధానులు నిర్మించి తీరతాం..’ అని వైసీపీ బలంగా చెబుతోంది. కానీ, ముందైతే ఓ రాజధాని నిర్మాణం చేసి చూపించండని విసక్షాలు ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Three Capitals, Agenda Point For 2024 Elections

ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల్ని పునఃప్రారంభిస్తోంది వైసీపీ సర్కారు. వీలైనంత తక్కువ కాలంలో, వీలైనంత ఎక్కువ అభివృద్ధి చేసి, రాజధానికి ఓ రూపం తెచ్చి, ఆ తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరోపక్క, త్వరలోనే మూడు రాజధానుల విషయమై అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లోపు అసెంబ్లీలో బిల్లు పెట్టినా, పెట్టకున్నా వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికీ మూడు రాజధానుల అంశం, ‘ఎన్నికల ఎజెండా’గా మారే అవకాశాలు స్పష్టంగా వున్నాయి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.