
Ysrcp
YCP : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ళ పాలన పూర్తి చేసుకున్నారు. సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మెరుగైన పాలన అందించేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన రెండేళ్ళు కూడా అత్యద్భుతమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి తప్పడం, గత పాలకులకు అలవాటైన విద్య అయితే.. ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీల్ని మూడేళ్ళలో నెరవేర్చిన ఘనత తమదని వైసీపీ చెబుతోంది.
ఇదే విషయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్లో ప్రస్తావించారు.కోవిడ్ సహా అనేక కారణాలతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా, సంక్షేమ పథకాలకు లోటు లేకుండా చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అప్పులు చేసి డబ్బులు పంచుతున్నారు.. అంటూ విపక్షాలు విమర్శలు చేసినాసరే, రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే, అది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.రాష్ట్ర అవసరాల నిమిత్తం అప్పులు చేయాల్సి వస్తే, కేంద్రం నుంచి సహకారం అందడంలేదు. ఇంకోపక్క, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల విక్రయించాలనుకుంటే.. కోర్టుల్లో కేసులు..
Ysrcp
ఇలా అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నా, అత్యంత సమర్థవంతంగా రాష్ట్రంలోకి అప్పుల రూపంలో అయినా, నిధుల్ని తీసుకురాగలుగుతున్నామన్నది వైసీపీ చెబుతున్న వాదన.మూడేళ్ళ పాలన ఒక యెత్తు.. ఇకపై మిగిలిన రెండేళ్ళ పాలన ఇంకో యెత్తు. అసలు సవాళ్ళు వైసీపీకి ఇప్పుడే ఎదురుకానున్నాయి. మూడేళ్ళ పాలనా కాలంలో జరిగిన ఎన్నికలన్నిటిలోనూ వైసీపీ విజయం సాధించింది. అయితే, సంక్షేమ పథకాల తాలూకు ఎఫెక్ట్ ఏంటన్నది ముందు ముందు తెలియనుంది. అవి సత్ఫలితాలనిస్తాయా.? లేదా.? అన్నదానిపైనా వైసీపీకి కొంత సందేహం వుంది. ఆ సందేహాలకు సమాధానం దొరకాలంటే 2024 ఎన్నికల వరకూ వేచి చూడాలి.
Foods High in Gelatin : ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, చర్మంపై ముడతలు వంటి…
Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…
Today Horoscope 15th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు (ఆదివారం, 15 ఫిబ్రవరి 2026)…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
This website uses cookies.