trs party won munugode bypoll elections 2022
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలలో అధికార పార్టీ టిఆర్ఎస్ మొదటి కొన్ని రౌండ్స్ మినహా మిగతా రౌండ్స్ అన్నిటిలో దూసుకుపోయింది. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11,666 మెజారిటీతో గెలిచారు. దీంతో టిఆర్ఎస్ నేతలు..కార్యకర్తలు గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, మైనంపల్లి హనుమంతరావు కార్యకర్తలతో కలిసి డాన్స్ వేశారు.టిఆర్ఎస్ పార్టీ గెలుపుతో మునుగోడు వాసులు ఆనందం వ్యక్తం చేసుకుంటున్నారు.
ఎందుకంటే ఈ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే.. స్వయంగా మంత్రి కేటీఆర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో కచ్చితంగా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. దీంతో 2018 నుంచి జరిగిన ఏ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాట లేకపోయింది.ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల జాప్యం పై బీజేపీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. పోలింగ్ సిబ్బందిని ఇబ్బందులు పాలు పెట్టే ప్రయత్నాలు కూడా చేసినట్లు పేర్కొన్నారు.
trs party won munugode bypoll elections 2022
ఎమ్మార్వో మరియు ఎంపీడీవోలతో స్వయంగా సీఎం మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాగా బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి టిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు..నైతికంగా తానే గెలిచినట్లు చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలలో గెలవడంతో పార్టీ కార్యకర్తలు ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.