TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC
ప్రధానాంశాలు:
TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30% వరకు పెంచడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సీజన్లో ఛార్జీలు పెంచేందుకు సంస్థకు అనుమతి ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ పెంపు సామాన్య ప్రయాణికులకు ఆర్థిక భారం అవుతోంది. పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ ఛార్జీలను తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC
TSRTC మహిళలకు ఫ్రీ అంటూ మగవారి నుండి నిలువు దోపిడీ చేస్తున్న TSRTC
హైదరాబాద్లోని ఉప్పల్ నుండి మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరుకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులు ఈ ఛార్జీల పెంపు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్స్ప్రెస్ బస్సులో సాధారణంగా రూ.220 ఉండే టికెట్ ధర, ప్రత్యేక బస్సులో రూ.330 వసూలు చేయడంతో వారు ఆశ్చర్యపోయారు. ఇది సాధారణ ధర కంటే 50% అధికం. ఈ విధంగా పండగ సమయంలో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉండగా, దాని భారాన్ని పురుషులపై మోపుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ, మరోవైపు ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు పెంచి, పురుష ప్రయాణికుల నుంచి అధిక డబ్బులు వసూలు చేయడం సమంజసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. పండుగ వేళ ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.