
cm ramesh to get central minister post
Chandrababu : ఇంకో సంవత్సరంలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రెండూ ఒకేసారి వస్తుండటంతో ఏపీలో రాజకీయ వేడి ప్రారంభం అయింది. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. అధికార వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గ ఇంచార్జ్ లు లాంటి వాటిపై దృష్టి పెట్టాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా వరుపుల సత్యప్రభను నియమించారు.
Chandrababu varupula satyaprabha is new tdp incharge for prathipadu
ఆమె ఎవరో కాదు.. ఇటీవల మరణించిన టీడీపీ నేత వరుపుల రాజా భార్య. దీంతో ప్రత్తిపాడు నియోజకవర్గానికి రాజా భార్యనే నియమిస్తున్నట్టు టీడీపీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. రాజా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ఉన్నారు. అలాగే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు డీసీసీబీ చైర్మన్ గానూ ఉన్నారు. ఆయన టీడీపీకి ఎన్నో సేవలు చేశారు. అందుకే.. రాజా భార్యకు తాజాగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతలను ఇచ్చారు. నిజానికి.. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రాజా ఓడిపోయాడు.
ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేశారు. కానీ.. పార్టీ నాయకులు బుజ్జగించడంతో మళ్లీ టీడీపీలో చేరారు. ఆ తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ఉన్నారు. కానీ.. ఇటీవల ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ప్రత్తిపాడు ప్రాంతంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉంది. ప్రత్తిపాడు మాత్రమే కాదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లో ఎక్కువగా కాపు వర్గం ఉండటంతో.. వచ్చే ఎన్నికల్లో వీటిలో దాదాపుగా అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అందులో భాగంగానే సత్యప్రభకు నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.