cm ramesh to get central minister post
Chandrababu : ఇంకో సంవత్సరంలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రెండూ ఒకేసారి వస్తుండటంతో ఏపీలో రాజకీయ వేడి ప్రారంభం అయింది. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. అధికార వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గ ఇంచార్జ్ లు లాంటి వాటిపై దృష్టి పెట్టాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా వరుపుల సత్యప్రభను నియమించారు.
Chandrababu varupula satyaprabha is new tdp incharge for prathipadu
ఆమె ఎవరో కాదు.. ఇటీవల మరణించిన టీడీపీ నేత వరుపుల రాజా భార్య. దీంతో ప్రత్తిపాడు నియోజకవర్గానికి రాజా భార్యనే నియమిస్తున్నట్టు టీడీపీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. రాజా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ఉన్నారు. అలాగే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు డీసీసీబీ చైర్మన్ గానూ ఉన్నారు. ఆయన టీడీపీకి ఎన్నో సేవలు చేశారు. అందుకే.. రాజా భార్యకు తాజాగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతలను ఇచ్చారు. నిజానికి.. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రాజా ఓడిపోయాడు.
ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేశారు. కానీ.. పార్టీ నాయకులు బుజ్జగించడంతో మళ్లీ టీడీపీలో చేరారు. ఆ తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ఉన్నారు. కానీ.. ఇటీవల ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ప్రత్తిపాడు ప్రాంతంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉంది. ప్రత్తిపాడు మాత్రమే కాదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లో ఎక్కువగా కాపు వర్గం ఉండటంతో.. వచ్చే ఎన్నికల్లో వీటిలో దాదాపుగా అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అందులో భాగంగానే సత్యప్రభకు నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.