Ramoji Rao : మార్గదర్శి కేసు ఈనాడు చైర్మన్ రామోజీ రావు మెడకు చుట్టుకున్న విషయం తెలిసిందే. అసలు మార్గదర్శి చిట్ ఫంట్స్ రామోజీరావుదేనా కాదా.. అనే విషయం కూడా త్వరలోనే తేలుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. రామోజీ రావుకు సంబంధించిన అన్ని విషయాల్లో త్వరలోనే తాను ఓ పుస్తకం రాస్తున్నానని, అందులో అన్ని వివరాలు పొందుపరుస్తానని చెప్పుకొచ్చారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ విషయాలు వెల్లడించారు. నిజానికి.. రిజర్వ్ బ్యాంకు రూల్స్ ప్రకారం.. రామోజీ రావు చిట్ ఫండ్ వ్యాపారం చేయడం కుదరదన్నారు.
కానీ.. ఆ నిబంధనలను పక్కన పెట్టిన రామోజీ రావు.. తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారాలు చేస్తున్నారన్నారు. చాలామంది చిట్ ఫండ్ పేరుతో వ్యాపారాలు నిర్వహించి ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని, రామోజీ రావు విషయంలోనూ అదే జరిగిందన్నారు. మార్గదర్శి కేసు విచారణలో భాగంగా రామోజీ రావు ఒకసారి చిట్ ఫండ్స్ తనదే అని, మరోసారి తనది కాదని అన్నారని.. కోర్టులోనే ఈ విషయం రామోజీ చెప్పినట్టు ఉండవల్లి గుర్తు చేశారు. రామోజీరావుతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని మార్గదర్శి యాజమాన్యం కూడా చెప్పిన విషయాన్ని ఈసందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.
అలాంటప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్యాలెన్స్ షీటుపై రామోజీరావు సంతకం ఎందుకు ఉంది అంటూ ప్రశ్నించారు. అందుకే.. అసలు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఎవరిది? రామోజీదేనా కాదా.. అనే విషయం ముందు తేలాలన్నారు. అందుకే.. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారాలపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని ఉండవల్లి చెప్పారు. అసలు విషయాలు బయటపడాలంటే.. ముందు ప్రభుత్వం దృష్టి పెట్టాలని అప్పుడే సంచలన విషయాలు బయటికి వస్తాయన్నారు. చూద్దాం మరి.. మార్గదర్శి కేసులో ఇంకెన్ని నిజాలు బయటికి రానున్నాయో.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.