Whatsapp : వాట్సాప్‌లో స‌రికొత్త ఫీచ‌ర్స్.. వాట్సాప్ ప్లే బ్యాక్ స్పీడ్ ఎలా పెంచాలి అంటే..!

Whatsapp : ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో అల‌రిస్తుంది. వాయిస్ మెసేజింగ్‌లో ప్రధానంగా నూతన సదుపాయాలను తీసుకొచ్చింది వాట్సాప్‌. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యాప్‌లకు ఈ ఫీచర్లు వచ్చాయి. చాట్‌లో నుంచి బయటికి వెళ్లినా వాయిస్ మెసేజ్‌లను వినేలా, వాయిస్ మెసేజ్‌ను పంపే ముందు ప్రివ్యూ ద్వారా చెక్ చేసుకునేలా, వాయిస్ రికార్డింగ్‌ను పాజ్, రిజ్యూమ్ చేసుకునే ఫీచర్లు యాడ్ అయ్యాయి. అలాగే వాయిస్ మెసేజ్‌ను సాధారణ స్పీడ్‌తో పాటు 1.5, 2 రెట్ల వేగంతోనూ వినవచ్చు. వాట్సాప్​లో వాయిస్​ మెసేజ్​ ఫీచర్​ చాలా పాపులర్. చాటింగ్ బదులు వాయిస్​ మెసేజ్​ పంపిస్తే చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పొచ్చు. అందుకని చాలామంది ఈ ఫీచర్​ ఉపయోగిస్తుంటారు. యూజర్ల కంఫర్ట్ కోసం వాయిస్​ మెసేజ్​లో కొత్త ఫీచర్లు తెచ్చింది వాట్సాప్. వాయిస్ మెసేజ్ రికార్డింగ్, షేరింగ్​ మరింత ఈజీ చేస్తాయి ఈ ఫీచర్లు.

ఇప్పటివరకు వాయిస్ మెసేజ్ వినాలంటే చాట్​లోకి వెళ్లాలి. అయితే, చాట్ ప్లే బ్యాక్ కొత్త ఫీచర్​ సాయంతో ఇకపై చాట్ నుంచి బయటికి వచ్చాక కూడా వాయిస్ మెసేజ్ వినొచ్చు. దాంతో, వాయిస్ మెసేజ్ వింటూనే మెసేజ్​లు చూస్తూ, రిప్లయ్​ ఇవ్వొచ్చు. పాజ్​​/ రెజ్యూమ్ ఉప‌యోగం ఏంటంటే వాయిస్​ మెసేజ్ రికార్డ్ చేసేటప్పుడు కొన్నిసార్లు అన్ని విషయాలు గుర్తుకు రావు. దాంతో, రెండు మూడు సార్లు వాయిస్​ మెసేజ్ పంపాల్సి వస్తుంది. అయితే ఇకనుంచి ఆ సమస్య ఉండదు. వాయిస్​ మెసేజ్​ రికార్డింగ్​ని మధ్యలోనే ఆపేయొచ్చు. ఆలోచించుకున్న తర్వాత మళ్లీ మెసేజ్​ రికార్డింగ్​ని రెజ్యూమ్ చేయొచ్చు.ఫాస్ట్ ప్లే బ్యాక్ వ‌ల‌న వాయిస్​ మెసేజ్​ని మామూలు స్పీడ్​లో వింటాం. ఇప్పుడు 1.5 టైమ్స్​, 2 టైమ్స్ స్పీడ్​లో కూడా వినొచ్చు. ఫార్వర్డ్ వాయిస్ మెసేజ్​లని కూడా ఈ స్పీడ్​లో వినొచ్చు.

whatsapp new features very interesting

Whatsapp : స‌రికొత్త ఫీచర్స్..

రిమంబర్ ప్లే బ్యాక్ ద్వారా చాట్​ నుంచి బయటికి వస్తే, మళ్లీ మొదటి నుంచి వాయిస్ మెసేజ్​ వినాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు వాయిస్​ మెసేజ్​ని పాజ్​ చేయొచ్చు. అంతేకాదు పాజ్​ చేసిన
వాయిస్​ మెసేజ్​ని ఆపేసిన దగ్గర నుంచి వినొచ్చు. ఈ కొత్త వాయిస్ మేసెజింగ్ ఫీచర్లు యూజర్లకు క్రమంగా వస్తున్నాయి. ప్రస్తుతం కొందరికి కొన్ని ఫీచర్లే యాడ్ కాగా.. రానున్న వారాల్లో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లందరికీ వస్తాయి.మరోవైపు మల్టిపుల్ లింక్డ్ డివైజెస్ ఫీచర్‌ను కూడా బీటా యూజర్లకు వాట్సాప్‌ అందించింది. స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్‌ ఖాతా ఆన్‌లైన్‌లో లేకున్నా లింక్ చేసిన కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ నుంచి వాట్సాప్‌ను వాడుకునేలా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఫోన్‌లో ఇంటర్నెట్ ఆన్‌లో లేకున్నా ఇది వరకే లింక్ చేసిన డివైజ్‌ నుంచి మెసేజ్‌లు పంపవచ్చు.. రిసీవ్ చేసుకోవచ్చన్న మాట.

Recent Posts

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగానే…

7 minutes ago

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…

1 hour ago

Warangal Congress : వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతుంది.. కొండా దంపతులు vs ఐదుగురు ఎమ్మెల్యేలు

Warangal Congress : కాంగ్రెస్‌ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్‌…

2 hours ago

RK Roja : గబ్బర్ సింగ్ ఇప్పుడు రబ్బర్ సింగ్ అయ్యాడు.. పవన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో

RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…

3 hours ago

Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ లేవు బోర్డు..!

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…

4 hours ago

Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…

5 hours ago

Ration Cards : వారందరికీ రేషన్ కార్డ్స్ కట్… కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…

6 hours ago

Guntur Sp : సింగ‌య్య మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ.. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తాను..!

Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…

7 hours ago