YS Viveka Murder Case : వైఎస్ వివేకానంద హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు వైఎస్ వివేకానంద హత్య కేసులో అసలు హంతకులు ఆయన కుమార్తె, అల్లుడే అని తేటతెల్లం అవుతోంది. వైఎస్ వివేకానందకు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న వాళ్లకు ఆయన కూతురు, అల్లుడు మద్దతుగా ఉన్నట్టు తెలుస్తోంది. వివేకా కుటుంబ సభ్యులు, టీడీపీ కలిసి వేసిన స్కెచ్చే ఇది అన్నట్టుగా తెలుస్తోంది. కావాలని వివేకా రాసిన లేఖను గోప్యంగా ఉంచి.. ఈకేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ఇరికించినట్టుగా తెలుస్తోంది. అవినాశ్ ను ఎందుకు ఇరికించారు. వివేకా హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఎంత అనేదానిపై దర్యాప్తు సాగాలి కానీ..
ఎల్లో మీడియా మాత్రం దానికి విరుద్ధంగా కథనాలు వండి వార్చుతోంది. అసలు.. వివేకా హంతకులతో, కుట్రదారులతోనే ఇంటర్వ్యూలు తీసుకుంది. వివేకాను చంపింది నేనే అని ఒప్పుకున్న దస్తగిరితో.. వివేకా హత్యకు ప్లాన్ చేసిన బీటెక్ రవితోనూ ఇంటర్వ్యూలు తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు, అల్లుడు జతకట్టారు. హంతకుడు దస్తగిరిని ఉసిగొప్పి వివేకాను చంపేందుకు కుట్రపన్నారు. ఇది కేవలం ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం జరిగిన హత్య. ప్రత్యర్థి పార్టీలు ఆడించినట్టుగా వీళ్లు ఆడారు. ఆ హత్య కేసును భూస్థాపితం చేసేందుకు కూడా వివేకా కుటుంబ సభ్యులే ప్రయత్నించారు.
అసలు వివేకా కుటుంబ సభ్యులు.. వివేకా ప్రత్యర్థులతో ఎందుకు జట్టు కట్టారు. వివేకా శత్రువులతో జట్టు కట్టడం ఏంటి.. నిజానికి.. వివేకాతో అల్లుడు, ఆయన చిన బావమరిది, పెద్ద బావమరిది లాంటి వాళ్లకు రాజకీయ వారసత్వ విభేదాలు ఉన్నాయి. ఆస్తి విభేదాలు కూడా ఉన్నాయి. ఆయన హత్య కేసును పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు అండ్ కో.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఇందులోకి లాగింది. వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అమరావతి నుంచే ఈ తతంగాన్ని మొత్తం చంద్రబాబు నడిపించారు. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు, టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవితో కలిసి ఈ ప్లాన్ ను దస్తగిరితో వర్కవుట్ చేయించారు అనేది సుస్పష్టం అవుతోంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.