
who will win in 2024 elections in puttaparthi district
YSRCP : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు వైసీపీ నేతలు సమాయత్తమవుతున్నారు. వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. వైసీపీ పార్టీలో అన్ని జిల్లాల్లో బలోపేతం చేస్తున్నారు. నిజానికి పుట్టపర్తి నియోజకవర్గంలో ఇదివరకు ఉన్న ఏ ఎమ్మెల్యేలు కూడా చేయని అభివృద్ధిని గత నాలుగేళ్లలోనే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగింది. వైసీపీ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తిని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. తాజాగా టీడీపీ యువనేత నారా లోకేశ్.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.
who will win in 2024 elections in puttaparthi district
ఆధారాలు లేని ఆరోపణలు నారా లోకేశ్ చేస్తున్నారు. ఇది అతడి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. లోకేశ్ కు కానీ.. పల్లె రఘునాథరెడ్డికి దమ్ముంటే నిరూపించాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాకనే పుట్టపర్తి నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందింది. పుట్టపర్తినే శ్రీసత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేయించాం. ఇక్కడ శాశ్వత అభివృద్ధికి బాటలు వేస్తున్నాం.. అని ఎమ్మెల్యే అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో గత నాలుగేళ్లుగా తాము కుల, మత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలనే అడిగితే చెబుతారు.. వైసీపీ పాలన ఎలా ఉందో. ఏపీ అభివృద్ధిలో ఎలా దూసుకుపోతోందో.
ప్రజాసంకల్ప యాత్రలో నల్లమాడ సభలో సీఎం జగన్ ఇచ్చిన మాట మేరకు.. ఈ ప్రాంతంలో కరువు లేకుండా చేస్తా అన్నారు. శాశ్వతంగా ఇక్కడ కరువును పారదోలారు. ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 200 చెరువులను హంద్రీనీవా ద్వారా నింపేందుకు అనుమతులు తీసుకొచ్చారు. దాని కోసం సుమారు రూ.864 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నాం. ఇవేమీ తెలియక.. టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు ఏదో ఒకటి వాగుతున్నారు అంటూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.