ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది ఇంటర్ మరియు 10 వ తరగతి పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా దాదాపు 20 రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయటమే లేక వాయిదా వేయటం చేశాయి. ఏపీ లో కూడా రోజుకు దాదాపు 15 వేల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షల విషయంలో ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్ళటం పట్ల అనేక వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించటం వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు.. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో పాటు వాళ్ళ తల్లితండ్రుల జీవితాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయనే విషయాన్నీ జగన్ ఎందుకు మర్చిపోయాడో అర్ధం కావటం లేదని స్వయంగా వైసీపీ అభిమానులే చెపుతున్నారు. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ చాలా ప్రమాదకరం – వ్యాప్తిలో, ప్రాణాపాయంలో. కేసులు కోకొల్లలు, గతంలో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం తరుపున జరుగుతున్నా సహాయక చర్యలు కూడా తక్కువే అని చెప్పాలి.
ఇలాంటి స్థితిలో జగన్ పరీక్షల విషయంలో ముందుకు వెళ్ళటానికి ఒక రకంగా టీడీపీ నేత నారా లోకేష్ కారణమని చెప్పే వాళ్ళు లేకపోలేదు. ఆంధ్రాలో పరీక్షలు వాయిదా వేయాలని మొదటి నుండి లోకేష్ డిమాండ్ చేస్తూ వచ్చాడు. ఒక దశ లో ప్రభుత్వం కూడా దీనిపై అలోచించి నిర్ణయం తీసుకోవాలని భావించింది. కానీ ఇప్పుడు పరీక్షలపై వెనక్కి తగ్గితే ఆ క్రెడిట్ మొత్తం లోకేష్ ఖాతాలోకి వెళ్లిపోతుందేమో అనే భయం వైసీపీ నేతల్లో కలగటంతో పరీక్షలను వాయిదా వేయటం కంటే నిర్వహించటమే మేలు అనే నిర్ణయం తీసుకున్నరుని కొందరు విశ్లేషకులు చెపుతున్న మాట..
ఒక సమయంలో సీఎం జగన్ మాట్లాడుతూ 50 ఏళ్ల భవిష్యత్ ఈ పరీక్షలు అందుకే వాయిదా వేయటం లేదని చెప్పాడు.. మరి గత ఏడాది ఇంత కంటే తక్కువగానే కేసులు ఉన్నకాని పరీక్షలు వాయిదా వేశారు.. అప్పుడు గుర్తుకు రాలేదా 50 ఏళ్ల భవిష్యత్.. ? అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.. ఒక్క మాట మాత్రం నిజం సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఏమైనా తేడా జరిగితే అది జగన్ జీవితాంతం మోయాల్సిన మచ్చ … వంద మంచి నిర్ణయాలు కూడా ఒక తప్పుడు నిర్ణయం ముందు తూకంలో నిలబడలేవు.. ఈ విషయాన్ని సీఎం దృష్టిలో పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.