why Ys jagan did not give any post to Killi Krupa Rani
Killi Krupa Rani : కిల్లి కృపారాణి.. శ్రీకాకుళం జిల్లాలోనే తనకు ఉన్న ఫాలోయింగ్ వేరు. కాంగ్రెస్ ను వదిలేసి కృపారాణి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కృపారాణికి… వైఎస్ జగన్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. తను కూడా ఎలాంటి పదవులు పొందలేదు. తనకు కనీసం రాజ్యసభ పదవి అయినా వస్తుందని కృపారాణి ఆశించారు. కానీ.. ఆ పదవీ దక్కలేదు. ఇటీవల భర్తీ చేసిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో కృపారాణికి పదవి దక్కుతుందని అంతా భావించినా సీఎం జగన్ తనను పక్కన పెట్టేశారు.
నిజానికి.. కిల్లి కృపారాణిని సీఎం జగన్ వేరే విధంగా వినియోగించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కింజారపు కుటుంబానికి పోటీగా కృపారాణిని దించాలనేది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే ఆమెకు ఎటువంటి పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ తనను వెయిట్ చేయిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి.. కిల్లి కృపారాణి.. 2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. తను శ్రీకాకుళంలోనే బలమైన సామాజిక వర్గం కళింగకు చెందిన నేత. తను కేంద్ర మంత్రిగానూ పని చేశారు.
why Ys jagan did not give any post to Killi Krupa Rani
శ్రీకాకుళం ఎంపీగా 1996 నుంచి 2009 వరకు ఎర్రనాయుడు ఉన్నారు. ఆయన మరణం తర్వాత రెండు సార్లు శ్రీకాకుళం ఎంపీగా ఆయన కొడుకు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అందుకే.. ఎలాగైనా కింజారపు కుటుంబాన్ని ఓడించేందుకు జగన్.. వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో శ్రీకాకుళంలో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
దీతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి కిల్లి కృపారాణి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే.. తనకు ఏ పదవి ఇవ్వకుండా జగన్ ఆమెను పదవులకు జగన్ దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు.. శ్రీకాకుళం అంతటా తిరిగి అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల మద్దతును పెంచుకోవాలని ఇప్పటికే జగన్.. ఆమెకు సూచించినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కిల్లి కృపారాణినే పోటీలోకి దించే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతోంది.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.