YS Jagan : సులభంగా గెలిచే నియోజకవర్గాలపై ఎక్కువగా ఎవ్వరూ దృష్టి పెట్టరు. కానీ.. కష్టతరమైన నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. ఎక్కడ గెలుపు అసాధ్యమూ.. ఎక్కడ గెలవడం కష్టమో అక్కడే ఫోకస్ పెడుతుంది. అక్కడే దృష్టి పెడుతుంది. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అదే పని చేస్తున్నారు. గెలుపు కష్టతరంగా ఉన్న ఆ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల మీద సీఎం జగన్ ఫోకస్ పెంచారు. ఏపీలో మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
అందులో 2019 ఎన్నికల్లో వైసీపీ 22 నియోజకవర్గాల్లో గెలిచింది. మూడు నియోజకవర్గాల్లో ఓడిపోయింది. అవి విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం నియోజకవర్గాలు. ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. అది కూడా కొద్ది తేడాతోనే. నిజానికి.. అక్కడ ఇంకాస్త కష్టపడి ఉంటే వైసీపీ ఆ నియోజకవర్గాల్లోనూ గెలిచేది. కేవలం 10 వేల లోపు మెజారిటీతోనే అక్కడ వైసీపీ ఓడిపోయింది. అయితే.. 2014 లోనూ ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయింది. వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి మాత్రం ఎలాగైనా ఆ మూడు నియోజకవర్గాలను గెలవాలన్న కసిలో సీఎం జగన్ ఉన్నారు.
ఈ మూడు నియోజకవర్గాలు అన్నీ టీడీపీ కంచుకోటలేమీ కాదు. వీటిలో శ్రీకాకుళంలో మాత్రం టీడీపీ ఏడు సార్లు గెలిచింది. ఎర్రన్నాయుడు తర్వాత ఆ నియోజకవర్గాన్ని రామ్మోహన్ నాయుడు గెలుస్తూ వస్తున్నారు. కానీ.. ఈసారి అలా కాకుండి ఆయా నియోజకవర్గాల్లో గెలిచి సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. మరి.. వైఎస్ జగన్ ప్రయత్నాలు ఈసారైనా ఫలిస్తాయా? ఒకవేళ ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిస్తే అప్పుడు మొత్తం 25 నియోజకవర్గాలు వైసీపీ వశం అవుతాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో?
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.