
Will KCR Establish A National Political Party
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తం బాగుపడాలి. దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటూ కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. ప్రధాని మోదీ వ్యతిరేకులతో చేతులు కలిపారు కేసీఆర్. చాలామంది ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్ ను వచ్చి కలుస్తున్నారు. అందరూ కలిసి మోదీ మీద దండయాత్ర ప్రారంభించారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని ముక్తకంఠంతో అందరూ నినాదాలు పలికారు. రైతు పార్టీని పెడతా.. రైతుల కోసం పార్టీని పెడతా అని సీఎం కేసీఆర్ కూడా మోదీపై కారాలు, మిరియాలు నూరారు. రైతు ప్రభుత్వం రావాలి దేశంలో అని చెప్పుకొచ్చిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీ గురించి ఊసే ఎత్తడం లేదంటూ వార్తలు వస్తున్నాయి.
కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నట్టు అనేదానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. కలిసిరాని కాలానికి ఎందుకు ఎదురు వెళ్లడం అని కేసీఆర్ అనుకుంటున్నారా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. జాతీయ స్థాయిలో కేసీఆర్ కు అస్సలు కలిసిరావడం లేదు. కేసీఆర్ తో కలిసి రావడానికి ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒప్పుకోవడం లేదు. అందరూ కేసీఆర్ ను కలుస్తున్నారు. కేసీఆర్ తో మంచిగానే మాట్లాడుతున్నారు కానీ.. కేసీఆర్ తో కలిసి నడిచే విషయంలో మాత్రం చాలామంది వెనకడుగు వేస్తున్నారు.
Will KCR Establish A National Political Party
ఇటీవలే సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లిన విషయం తెలిసిందే. నితీశ్ ను కలిసి తనతో కలిసి నడవాలని కోరారు. కానీ.. ఇప్పుడు నితీష్ కూడా కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తో కలిసి మోదీని ఢీకొట్టేందుకు నితీష్ రెడీ అయిపోయారు. కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు రెడీ అవడంతో ఇక కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ లో ఉండరు అని అర్థం అయిపోయింది. మరోవైపు మమతా బెనర్జీ కూడా మోదీపై ఈ మధ్య ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. దీంతో మోదీకే మమతా ఓటేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ వెంట నడిచేది కేవలం కర్ణాటకకు చెందిన జనతాదళ్ పార్టీ నేత కుమార స్వామి మాత్రం కేసీఆర్ తో కలిసి నడిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ.. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి కుంభస్థలాన్ని ఢీకొట్టగలవా? అనేదే పెద్ద ప్రశ్న. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
This website uses cookies.