MLA Roja గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. తను వైసీపీలోనే ఫైర్ బ్రాండ్. ఓ వైపు సినిమా ఇండస్ట్రీలో నటిగా రాణిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీ అయిపోయింది రోజా. రెండు డిఫరెంట్ ఫీల్డ్స్ లో రాణిస్తూ.. అందరి ప్రశంసలు అందుకుంటోంది రోజా. తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు. అందుకే.. తనకు రెండు సార్లు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టారు నగరి ప్రజలు.
అయితే.. వైసీపీలో ఎంతో ప్రాధాన్యత ఉన్న రోజా.. ఎందుకో ఈమధ్య పార్టీకి దూరం అవుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి.. తనకు మంత్రి పదవి రావాల్సింది కానీ.. కొన్ని సమీకరణల వల్ల తనకు మంత్రి పదవి దక్కలేదు కానీ.. వేరే పదవిని ఇచ్చి రోజాను శాంతింపజేశారు సీఎం జగన్.
తను ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ కోసం ఎంతో కృషి చేసింది. ఎదుటి వ్యక్తి ఎంతటి వారు అయినా సరే.. తన పదునైన వ్యాఖ్యలతో ధీటైన సమాధానం ఇవ్వగల సత్తా ఉన్న నేత రోజా. అందుకే.. తను ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీకి కొండంత అండ.
ప్రస్తుతం వైసీపీలోనూ కీలక పాత్ర పోషిస్తున్న రోజా.. ఆ పార్టీకి దూరం అవుతున్నట్టు తెలుస్తోంది. దానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయట.
ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొన్నది. ఈ నేపథ్యంలో తిరుపతిలో వైసీపీ నేతలు పార్టీ సమన్వయ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యారు. ఆయన సమక్షంలో నిర్వహించిన ఈ మీటింగ్ కు చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా హాజరయ్యారు. కానీ.. రోజా మాత్ర హాజరు కాలేదు. తను చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే కాబట్టి.. మంత్రి పెద్దిరెడ్డి.. స్వయంగా ఆహ్వానించారట. అయినా కూడా తనకు హాజరు కాలేదు.. అనే ప్రచారం జోరుగా సాగడంతో.. వైసీపీకి రోజా దూరం అవుతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
నగరి నియోజకవర్గానికి చెందిన మరో వైసీపీ నేత నారాయణ స్వామికి, రోజాకు ఈమధ్య పడటం లేదని.. ఇద్దరి మధ్య వార్ మొదలైందని.. అందులోనూ కొందరు మంత్రులు కావాలని రోజాను పార్టీలో దురం పెడుతున్నారని.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రోజా.. కావాలని పార్టీకి దూరం అవుతున్నారని తెలుస్తోంది.
త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలోనూ రోజాను తీసుకోకుండా ఉండేందుకు కొందరు మంత్రులు రోజా గురించి తప్పుడు సమాచారాన్ని సీఎం జగన్ కు అందించారని.. ఇలా.. రోజాను జగన్ ముందు బ్యాడ్ చేసి.. రోజాను పార్టీకి దూరం చేయాలని కొందరు మంత్రులు తెగ ప్రయత్నిస్తున్నారట. దానితో పాటు తనకు మంత్రి పదవి రాకపోవడంతో.. లోలోపల రోజా కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారట.
వీటన్నంటినీ గమనిస్తే.. రోజా ఇంకా కొన్నేళ్ల వరకు పార్టీలో సైలెంట్ అయిపోయి.. తన ప్రాధాన్యతను పార్టీకి తెలియజెప్పాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో?
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.