వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజురోజుకూ డోస్ పెంచుతున్నారు. తన సొంత పార్టీ వైసీపీ మీద, సీఎం జగన్ మీద విమర్శల దాడి చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎంపీ గెలిచి.. తర్వాత రెబల్ గా మారి.. పార్టీకి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు రఘురామ. ఢిల్లీలోనే ఉంటూ.. వైసీపీ బాగోతాలను ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు.
అయితే.. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థం దగ్గర్లోని బోడికొండపై ఉన్న సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. సరిగ్గా ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయనగరం పర్యటనకు ముందే ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
శ్రీరాముడి విగ్రహం తల, మొండాన్ని దుండగులు వేరు చేశారు. దాన్ని ధ్వంసం చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు అయితే తీవ్రంగా స్పందిస్తున్నారు. హిందుత్వ వాదులు కూడా ఏంటి ఇది.. హిందూ దేవాలయాలపై ఇలా దాడులకు పాల్పడుతున్నారు.. అంటూ విరుచుకుపడుతున్నారు.
ఈనేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామ కూడా స్పందించారు. అసలు.. సీఎం జగన్ కు సిగ్గుందా? ఇలాంటి పనులా చేసేది. హిందూ దేవాలయాలపై కావాలని కొందరు దాడులు చేస్తున్నారు. హిందూ మతాన్నే కావాలని టార్గెట్ చేస్తున్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందో వెంటనే ప్రభుత్వం తేల్చాలి. జగన్ కు హిందువులంటే అంత చులకనగా కనిపిస్తున్నారు. ఇలా.. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు. ఎందుకు ఆ దాడులను ఆపలేకపోతున్నారు. సీఎంకు ఏమాత్రం సిగ్గు ఉన్నా… ఈ దాడులను వెంటనే ఆపించేయాలి.. అంటూ రఘురామ డిమాండ్ చేశారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.