YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. ఈ విక్టరీ పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఆ మూడు జిల్లాల్లో మాత్రం అధికార వైసీపీకి దెబ్బ తగిలినట్టే కనబడుతున్నది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ మూడు జిల్లాల్లో టీడీపీ పుంజుకున్నది. కాగా, అలా వైసీపీని దెబ్బతీసిన అంశమేమిటంటే..ప్రస్తుతం ప్రతిపక్ష పోషిస్తున్న టీడీపీ వచ్చే ఎన్నికల నాటికి అధికార పక్షంగా మారాలనుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు, భావినేత నారా లోకేశ్, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కష్టపడుతున్నారు.
ఈ క్రమంలోనే మూడు రాజధానుల అంశాన్ని విమర్శిస్తూ అమరావతియే రాజధాని అని అంటున్నారు. అమరావతి రాజధాని అన్న విషయమై కట్టుబడి ఉన్నామని ఇప్పటికే చాలా సార్లు చంద్రబాబు ప్రకటన కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ బలపడినట్లు కనబడుతున్నది. కృష్ణా జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో టీడీపీ ఒక రకంగా గెలిచినట్లే అని చెప్పుకోవచ్చు. జగ్గయ్యపేటలో అధికార వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ టీడీపీ చాలా గట్టి పోటీనిచ్చింది. కొండపల్లి మున్సిపాలిటీలోనూ టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. మొత్తంగా కృష్ణా జిల్లాలో టీడీపీ బాగా పుంజుకుందని చెప్పడానికి ఆ పార్టీ గెలిచిన స్థానాలు చాలు.
గుంటూరు జిల్లాలోనూ అదే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడం గమనార్హం. మొత్తంగా మూడు రాజధానుల అంశం టీడీపీకి లాభం చేకూర్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. ఈ మూడు జిల్లాల్లో టీడీపీ ఇంకా బాగా పుంజుకునే చాన్సెస్ ఉన్నాయి. ఫలితంగా అధికార వైసీపీకి భవిష్యత్తులో గట్టి దెబ్బ తగిలే చాన్సెస్ ఉండొచ్చు. చూడాలి మరి.. ఈ మూడు జిల్లాల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సానుకూలతగా అధికార వైసీపీ ఎలా మార్చుకుంటుందో మరి..
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.