why there is no rahul gandhi bharat jodo yatra in gujarat
YS Jagan : మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేదేలే అని సీఎం జగన్ చెప్పకనే చెప్పారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పంద్రాగస్టు నాడు స్వాతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలకు మరోసారి మూడు రాజధానుల అంశాన్ని వినిపించారు. అంటే.. వైసీపీ ఇంకా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గలేదు అని తేటతెల్లమైంది. మూడు రాజధానులతోనే పాలనా వికేంద్రీకరణ సాధ్యం అవుతుందని సీఎం జగన్ బలంగా నమ్ముతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల అంశం కోర్టులో నలుగుతున్నా.. ఒకటే రాజధాని ముద్దు అంటూ అమరావతి కోసం దీక్షలు జరుగుతున్నా.. మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదు లేదని సీఎం జగన్ మరోసారి నిరూపించారు.
పాలనా వికేంద్రీకరణలో భాగంగానే.. సర్వముఖోభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాలు ఎలాంటి వివక్షకు గురి కాకుండా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం జగన్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు 13 గా ఉన్న జిల్లాలు 26 అయ్యాయి. గ్రామ సచివాలయాలు కూడా పాలనా వికేంద్రీకరణలో భాగమే. మూడు రాజధానుల్లో భాగంగా వైజాగ్ కు పాలనా రాజధాని హోదా కల్పించాలి. దాని కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి. అంతకంటే ముందు హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయాలి.
ys jagan decision on three capitals in ap
అందుకే.. ఇదంతా జరిగే సరికి టైమ్ పడుతుంది కాబట్టి… ముందు వైజాగ్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఏర్పాటు చేసి పాలనా రాజధానిగా దాన్ని అనధికారికంగా ప్రకటించేయాలనే ఆలోచన చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం. అందులో భాగంగానే వైజాగ్ లో సీఎం క్యాంప్ ఆఫీసును ప్రకటించడం కోసం దసరాకు ముహూర్తం నిర్ణయించింది.. అనే ప్రచారం సాగుతోంది. విశాఖను రాజధానిగా ఇదిగో ప్రకటిస్తారు.. అదిగో ప్రకటిస్తారు అని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అవేమీ నిజం కాలేదు. మరి.. ఈసారి దసరాకు అయినా విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసును వైసీపీ ప్రభుత్వం ఓపెన్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.