YS Jagan : అంతా ఓకే కానీ.. జగన్ కు దెబ్బపడేది అక్కడే.. ఫోకస్ మార్చకపోతే అంతే సంగతులు

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 28 August 2022, 7:00 am

YS Jagan : ఏపీలోనే కాదు.. ఎక్కడైనా సరే.. ఒక రాజకీయ పార్టీ గెలవాలంటే గ్రామీణ ఓటర్లదే తుదినిర్ణయం. గ్రామీణ ఓటర్లు ఎటువైపు నిలబడితే వాళ్లదే అధికారం. ఎందుకంటే అర్బన్ ఓటర్లు పెద్దగా పోలింగ్ లో పాల్గొనరు. పాల్గొన్నా వాళ్ల ఓటు ఎటువైపు పడుతుందో చివరి వరకు క్లారిటీ ఉండదు. అందుకే.. అర్బన్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కంటే పోలింగ్ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయితే.. అర్బన్ ప్రాంతాల్లో కనీసం 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాదు. అందుకే.. ఎవరైనా గెలవాలంటే గ్రామీణ ఓటర్ల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. నిజానికి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఏపీలోని గ్రామీణ ప్రాంతాల మీదనే ఫోకస్ పెట్టారు.

పేద, గ్రామీణ ప్రజల కోసమే ఆయన పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. అందుకే.. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి ఎలాంటి సమస్య లేదు. వైసీపీ గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రాంగ్ గానే ఉందని నమ్ముతున్నారు. కానీ.. అర్బన్ ప్రాంతాల సంగతి ఏంటి? అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ చాలా వీక్ గా ఉంది. జగన్ ప్రవేశపెట్టే ఎలాంటి పథకం అయినా చివరకు గ్రామీణ ప్రాంతాలకే ఉపయోగపడుతుంది కానీ.. అర్బన్ ఓటర్లకు ఎలాంటి ఉపయోగం లేదు. సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు వెచ్చించినా కూడా అభివృద్ధి కుంటుపడటంతో అర్బన్ ఓటర్లు జగన్ మీద అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క ప్రజలు మాత్రమే కాదు.. ఉద్యోగ వర్గాలు, ఇతర వర్గాలు కూడా వైసీపీ పాలనపై అసంతృప్తితో ఉన్నాయి. పన్నుల విషయంలోనూ ప్రజలు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ys jagan focuses more to strengthen party in urban areas

ys jagan focuses more to strengthen party in urban areas

YS Jagan : కొత్త జిల్లాల ఏర్పాటు జగన్ కు మైలేజ్ పెంచాయి

జగన్ తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకోకపోయినా.. ఇటీవల కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం మాత్రం జగన్ కు మైలేజ్ ను తీసుకొచ్చింది. జిల్లా కేంద్రాలు, జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తే అర్బన్ ప్రాంతాల్లో వైసీపీకి కాస్తో కూస్తో మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే.. ఇది సరిపోదు. అర్బన్ ప్రాంతాల్లో ఇంకా యాక్టివ్ కావాలి.. ఫోకస్ పెంచాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పలు సర్వేలలోనూ అర్బన్ ప్రాంతాల్లోనే పార్టీ వీక్ గా ఉందనే నివేదికలు అందాయి. అందుకే అర్బన్ ప్రాంతాలపై జగన్ ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలు ఎలాగూ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక వచ్చే రెండేళ్లు అర్బన్ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ఇప్పటి నుంచే సీఎం జగన్ అన్ని జిల్లాల పర్యటనలను కూడా ప్రారంభించారు.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి