
ys jagan mohan reddy
Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా పండి పోతున్నారు. సీఎం అవ్వక ముందు వరకు కూడా రాజకీయంలో పెద్దగా అనుభవం లేని వాడిగా కనిపించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం రాబోయే ఎన్నికల కోసం అన్నట్లుగా ముందస్తు వ్యూహాలు పన్నుతున్నాడు. ప్రతి జిల్లాలో కూడా ఇప్పటి నుండే ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లీడర్లను పెంచి పోషిస్తున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో వైకాపాను మరింత బలోపేతం చేసేందుకు కమ్మ సామాజిక వర్గంకు చెందిన బలమైన నాయకుడు ఎంతైనా అవసరం. యువ నాయుడు మరియు కమ్మ సామాజిక వర్గంకు చెందిన నాయుడుకు వైకాపాలో ఉంటే ఖచ్చితంగా కృష్ణ జిల్లాలో ముందు ముందు అద్బుతమైన ఫలితాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. అందుకే కమ్మ సామాజిక వర్గంకు చెందిన అవినాష్ ను వైఎస్ జగన్ మోమన్ రెడ్డి వాడేస్తున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బలమైన రాజకీయ వారసత్వం ఉన్న దేవినేని అవినాష్ ప్రస్తుతం వైకాపాలో కీలక నాయకుడిగా కొనసాగుతున్నాడు. కృష్ణా జిల్లాలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా సీఎంతో పాటు దేవినేని అవినాష్ పేరు ఉంటుంది. కృష్ణా జిల్లాలో ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అవినాష్ ను పక్కన ఉంచుకుంటున్నట్లుగా కూడా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న ఒక నాయకుడు ఇటీవల మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అవినాష్ పై చాలా నమ్మకం ఉంది. అతడు మంచి భవిష్యత్తు ఉన్న లీడర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీన్ని బట్టి అవినాష్ కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు.
ys jagan mohan reddy
కృష్ణా జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో అవినాష్ కు మాత్రమే వైకాపా ప్రాముఖ్యత ఇస్తుందని అంటున్నారు. కొందరు సీనియర్ నాయకులు ఉన్నా కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం కమ్మ సామాజిక వర్గంకు చెందిన దేవినేని అవినాష్ నే ముందు ఉంచుతున్నారు. తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు మరియు కార్యకర్తలను వైకాపా వైపు లాగడంలో దేవినేని అవినాష్ క్రియాశీలకంగా పని చేసే అవకాశం ఉంది. అందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు అవినాష్ ను వాడేస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.