TDP : ఏపీలో అధికార పార్టీ ఆగడాలకు నిరసనగా తాము పరిషత్ ఎన్నికల పోటీ నుండి తప్పుకుంటున్నట్లుగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశాడు. కొత్త సీఎస్ వచ్చిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. పాత నోటిఫికేషన్ ను యధావిధిగా కంటిన్యూ చేయాలని ఇప్పటికే నామినేసన్ లు జరిగిన నేపథ్యంలో అక్కడ నుండే ఎన్నికల పక్రియ అనేది మొదలు పెట్టబోతున్నట్లుగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంను ఏర్పాటు చేశారు. పరిషత్ ఎన్నికల విషయంలో చర్చించిన పొలిట్ బ్యూరో చివరకు ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు.
బుదవారం నాడే ఎన్నికలను బహిష్కరించబోతున్నట్లుగా వార్తలు వచ్చినప్పటికి పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తాజాగా పార్టీ నాయకత్వం మీటింగ్ లో వైకాపా వైకరికి వ్యతిరేకంగా ఎన్నికలను బహిష్కించాల్సిందిగా నిర్ణయానికి వచ్చినట్లుగా పేర్కొన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుల్లో మెజార్టీ మెంబర్స్ పరిషత్ ఎన్నికల్లో పోటీకి విముఖత వ్యక్తం చేశౄరు. ఇదే సమయంలో ఇప్పటికే నామినేషన్ లు వేసిన ప్రతి ఒక్క అభ్యర్తి కూడా తమ నామినేషన్ల ను ఉపసంహరించుకోవాలంటూ ఆదేశించింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా పోటీ చేయవద్దంటూ ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
తెలుగు దేశం పార్టీ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ అవినీతికి పాల్పడుతుందని అక్రమాలకు పాల్పడుతుందని ఇలా ఎన్నికలను బహిష్కరించడం ఏమాత్రం సరైన నిర్ణయం కాదంటూ ఆరోపణలు వస్తున్నాయి. పరిషత్ ఎన్నికల విషయంలో తెలుగు దేశం పార్టీ భయపడి వెనకడుగు వేసిందని అంటున్నారు. పంచాయితీ ఎన్నికలు మరియు మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మళ్లీ ఘోర పరాభవం తప్పదనే ఉద్దేశ్యంతోనే పరిషత్ ఎన్నికల్లో పోటీకి చంద్రబాబు నాయుడు దూరంగా ఉంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదంటున్నారు. చంద్రబాబు నాయుడు తలతిక్క నిర్ణయంగా కొందరు అభివర్ణిస్తున్నారు. ప్రజా స్వామ్యంపై నమ్మకం ఉన్న వారు ఎన్నికలను బహిష్కరించరు. చంద్రబాబు నాయుడుకు నమ్మకం లేకపోవడం వల్లే ఆయన ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.