YS jagan ఆంద్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి 150 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కానీ అందులో యాక్టీవ్ గా ఉంటున్న ఎమ్మెల్యేలు అతి కొద్దీ మంది మాత్రమే అని తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా ప్రళయం సృష్టిస్తున్న ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కరోనా మొదటి వేవ్ లో ప్రజల మధ్యకు వచ్చి వాళ్ళ బాగోగులు చూసుకున్న నేతలు, సెకండ్ వేవ్ లో మాత్రం ఎక్కడ కనిపించటం లేదు.
ఇలాంటి సమయంలో వైసీపీ తరుపున ఇద్దరి ఎమ్మెల్యేల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు చేస్తున్న పనులు ప్రభుత్వ వ్యతిరేక మీడియా కూడా కవర్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆయా నేతల గురించి తెలుసుకోవాల్సిందే.. అందులో ఒకరు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి.
ఈ కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తూ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నాడు. కొన్ని కల్యాణ మండపాలను తీసుకోని, అక్కడే సొంతగా కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇక్కడ కూడా రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.సింహాద్రి రమేష్బాబు తన నియోజకవర్గంలో వంద పడకలతో ప్రత్యేకంగా ఆసుపత్రిని నిర్మించారు. అదే సమయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సైతం మానిటరింగ్ చేస్తున్నారు. ఆక్సిజన్పై ప్రత్యేక దృష్టి పెట్టి.. కరోనా బాధితులు కోలుకునేలా చేస్తున్నారు.
అదే విధంగా కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు. కొందరికి రూ.1000 చొప్పున రమేష్బాబు అందిస్తున్నారు. దీంతో అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరు మార్మోగుతోంది. కరోనా మొదటి వేవ్ నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంతగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. దీనితో ఆ ఇద్దరు పేర్లు సీఎం జగన్ దగ్గరకు చేరుకోవటంతో, స్వయంగా జగన్ వాళ్లకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తుంది. మరి ఈ ఇద్దరినీ చూసి మిగిలిన ఎమ్మెల్యేలు ఏమైనా ముందుకు కదులుతారో లేదో చూడాలి
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.