Etela rajender తెరాస పార్టీ నుండి దాదాపుగా బయటకు వచ్చిన కీలక నేత ఒకప్పటి ఉద్యమ నాయకుడు ఈటెల రాజేందర్ Etela rajender రాజకీయంగా ఇప్పుడు కూడలిలో నిలబడి ఉన్నాడు. మంత్రివర్గం నుండి కేసీఆర్ బయటకు పంపిన తర్వాత తెరాస మీద తిరుగుబాటు జెండా ఎగరవేసిన ఈటల మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టి వాటి సహాయంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో తెరాసకు గట్టి షాక్ ఇవ్వాలని భావించాడు.
అయితే ఈటల కు ఊహించని షాక్ లు తగులుతూనే ఉన్నాయి. గత కొద్దీ రోజుల నుండి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ లోని కీలక నేతలతో వరసగా భేటీలు నిర్వహించాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుండి సానుకూల స్పందన రాలేదని సమాచారం. బీజేపీ నేతలు మాత్రం స్వతంత్రంగా ఉప ఎన్నికల్లో పోటీచేస్తే తాము మద్దతు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరి ఆ పార్టీ తరుపున పోటీచేయాలని, ఆ తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా చేస్తామని బీజేపీ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
దీనితో ఈటల కాషాయం గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. “పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆపాయిట్మెంట్ ఖరారు కాగానే ఈటల ఢిల్లీ వెళ్లి కలుస్తారు. ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేయాలి అనేది జాతీయ నాయకత్వంతో మాట్లాడిన తర్వాత సృష్టత వస్తుందని” బీజేపీ ముఖ్యనేత ఒకరు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈటల బయోడేటా ఢిల్లీ బీజేపీ అగ్రనేతల దగ్గరకు చేరుకున్నట్లు తెలుస్తుంది.
బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ ఛుగ్ తో పటు బండి సంజయ్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ ఈ ముగ్గురు ఈటల విషయంలో కీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలో చేరితే మీ పోరాటానికి మేము అండగా ఉంటామని ఛుగ్ తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఈటల రాజేందర్ Etela rajender కూడా తన వర్గం నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. శామీర్ పేట లోని ఆయన స్వగృహంలో కీలక అనుచరులతో భేటీ అయినట్లు సమాచారం.ఈటల వ్యవహారం చూస్తుంటే దాదాపుగా బీజేపీలోకి చేరినట్లే అనిపిస్తుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.