
ys jagan
Ys Jagan : రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ పార్టీనేతలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో సంప్రదింపులు జరిపిన జగన్ అండ్ కో.. పీకే టీం రాష్ట్రంలో అడుగుపెట్టగానే ఎన్నికల యుద్దాన్ని ప్రకటించనుంది. దీంతో వైసీపీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోకి దిగనున్నారని టాక్. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే తిష్టవేశారని తెలుస్తోంది. ఇన్నిరోజులు జనాలకు దూరంగా ఉన్న ప్రజాప్రతినిధులు అంతా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు.
ys jagan
తాము ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం లేదని ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ను జగన్ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే వైఎస్సార్ ఆసరా పథకం లబ్దిదారులకు అందేలా జగన్ రూట్ మ్యాప్ ప్లాన్ చేశారు. వారానికి 2 రోజుల పాటు తప్పనిసరిగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఉండి గ్రామ సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. తాను కూడా రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామ సచివాలయాలను విజిట్ చేస్తానని ప్రకటించారు.అయితే, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లినా పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన అన్ని పనులను, సమస్యలను వాలంటీర్లే అడిగి మరి తీరుస్తున్నారు.
Ysrcp
దీంతో ఎమ్మెల్యేలకు పెద్దగా పనిలేకుండా పోయింది. ప్రజల వద్దకు వెళ్లి మీకు ఏమైనా బాధలు ఉన్నాయా అని ప్రజాప్రతినిధులు అడిగినా స్పందన కరువైందట.. దీంతో ఎమ్మెల్యేలు వాలంటీర్ల వ్యవస్థపై మండిపడుతున్నారట.. ఇది జగన్ డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో ఎవరూ ఏమీ అనలేకపోతున్నారని తెలిసింది. ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకే జగన్ వారానికో కార్యక్రమం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. వారంలో 5 రోజులు వారు నియోజకవర్గంలో జనాలకు అందుబాటులో ఉంటే వారిపై ఉన్న వ్యతిరేకత కొంతైనా తగ్గుతుందని సీఎం జగన్ భావించారని తెలిసంది. అందుకోసమే వారికి ఈ టాస్క్లను అప్పగించారని టాక్ నడుస్తోంది.
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే దిశగా మరో భారీ అడుగు వేసింది. ఇకపై…
Jasprit Bumrah : ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ (MI) అంటేనే ఒక బ్రాండ్. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో 200…
Sunstroke : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో 'వడదెబ్బ'…
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
This website uses cookies.