
ys jagan
Ys Jagan : రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ పార్టీనేతలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో సంప్రదింపులు జరిపిన జగన్ అండ్ కో.. పీకే టీం రాష్ట్రంలో అడుగుపెట్టగానే ఎన్నికల యుద్దాన్ని ప్రకటించనుంది. దీంతో వైసీపీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోకి దిగనున్నారని టాక్. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే తిష్టవేశారని తెలుస్తోంది. ఇన్నిరోజులు జనాలకు దూరంగా ఉన్న ప్రజాప్రతినిధులు అంతా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు.
ys jagan
తాము ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం లేదని ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ను జగన్ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే వైఎస్సార్ ఆసరా పథకం లబ్దిదారులకు అందేలా జగన్ రూట్ మ్యాప్ ప్లాన్ చేశారు. వారానికి 2 రోజుల పాటు తప్పనిసరిగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఉండి గ్రామ సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. తాను కూడా రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామ సచివాలయాలను విజిట్ చేస్తానని ప్రకటించారు.అయితే, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లినా పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన అన్ని పనులను, సమస్యలను వాలంటీర్లే అడిగి మరి తీరుస్తున్నారు.
Ysrcp
దీంతో ఎమ్మెల్యేలకు పెద్దగా పనిలేకుండా పోయింది. ప్రజల వద్దకు వెళ్లి మీకు ఏమైనా బాధలు ఉన్నాయా అని ప్రజాప్రతినిధులు అడిగినా స్పందన కరువైందట.. దీంతో ఎమ్మెల్యేలు వాలంటీర్ల వ్యవస్థపై మండిపడుతున్నారట.. ఇది జగన్ డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో ఎవరూ ఏమీ అనలేకపోతున్నారని తెలిసింది. ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకే జగన్ వారానికో కార్యక్రమం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. వారంలో 5 రోజులు వారు నియోజకవర్గంలో జనాలకు అందుబాటులో ఉంటే వారిపై ఉన్న వ్యతిరేకత కొంతైనా తగ్గుతుందని సీఎం జగన్ భావించారని తెలిసంది. అందుకోసమే వారికి ఈ టాస్క్లను అప్పగించారని టాక్ నడుస్తోంది.
YSRCP: గంగాధర నెల్లూరు రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీలో కృపా లక్ష్మి YCP…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక టీవీ చర్చా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.…
Jayashankar : ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తన వ్యూహచతురతతో తన నౌకలను సురక్షితంగా ఒడ్డుకు…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది అదేమిటంటే నారా లోకేష్…
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
Gold and Silver Rate 15 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు,…
Curd for Health : పెరుగు అనేది అన్ని కాలాల్లో తినదగిన పోషకాహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి…
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
This website uses cookies.